Saturday, December 24, 2011

సిండికేట్లే విలన్లు

టార్గెట్లే నియంత్రణకు అవరోధం వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపణ

హైదరాబాద్, డిసెంబర్ 23: మద్యం సిండికేట్లు ఎక్సైజ్‌శాఖను శాసించేస్థాయికి చేరుకున్నాయని, వాటివల్లనే తమ శాఖకు చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపించింది. ప్రభుత్వం తన ఆదాయం పెంచుకోవడం కోసం మద్యం అమ్మకాలకు టార్గెట్స్ పెట్టిందని, దీనివల్లనే వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సి వస్తుందని ఎక్సైజ్ జెఎసి పేర్కొంది. ఎక్సైజ్‌శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ అఫీసర్స్ సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ సంఘాలు కలిసి శుక్రవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగుల జెఎసిగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్‌గా ఎన్నికైన ఎస్‌ఎం రామేశ్వర్‌రావు, సెక్రటరీ జనరల్ ఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తాజాగా ఎక్సైజ్‌శాఖపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయం పెంచుకునేందుకు తమకు టార్గెట్స్‌ను విధించిందని, దీనివల్ల వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరించలేదని వారు వాపోయారు. పైగా తమశాఖకు సిబ్బంది కొరత వేధిస్తోందని దీనిని కూడా సిండికేట్లు తమకు సానుకూలంగా మలుచుకుని నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమేనని వారు అంగీకరించారు. ఇక నుంచి అలా జరగకుండా కఠినంగా వ్యవహరించక తప్పదని రామేశ్వర్‌రావు హెచ్చరించారు. ఎమ్మార్పీ రేట్లు, మద్యం షాపుల సమయపాలన, విడి అమ్మకాలపై దృష్టి సారించి మద్యం సిండికేట్ల ఆటకట్టిస్తామని వారు పేర్కొన్నారు. మద్యం సిండికేట్లకు,తమ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని వారు ఖండించారు. సిబ్బంది కొరత, వనరులు, సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇసుక తీస్తే ఇక ఉక్కు పాదమే


* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు  
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
-ఆంధ్రభూమి బ్యూరో -

కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు.

షరా‘మామూల్’..

* పోలీసులు, రెవెన్యూలకే సింహభాగం

* విడిసిల ముసుగులో అక్రమ అనుమతులు

* యథేచ్ఛగా ఇసుక మాఫియా


కరీంనగర్, డిసెంబర్ 22: నిన్న లిక్కర్ సిండికేట్ కుంభకోణం..నేడు ఇసుక మాఫియా..ఇలా ఏ కుంభకోణం వెలుగులోకి వచ్చినా అందులో అధికార పార్టీ ముద్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌కు చెందిన చోటా మోటా నాయకులదే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. చోటా మోటా నాయకులే కదా! అని తీసిపారేయకండీ. వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లుకమ్మక తప్పదు. సగటున రోజుకు వారి ఆర్జించేది అక్షరాల లక్ష రూపాయల పై మాటే. ఇందుకు భూగర్భ జలవనరుల శాఖ, గనుల శాఖ అధికారుల తోడ్పాటు షరా‘మామూల్’గా జరిగిపోయేదే. ప్రతిఫలంగా అక్రమార్కులను చూసి చూడనట్లుగా వదిలివేయటమే. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట అధికార పార్టీకి చెందిన నేతలు అనధికారికంగా ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. ఇందుకుగాను కేవలం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు విడిసికి చెల్లించి ఇక ఆ ఏడాది పొడవునా కావాల్సినంత ఇసుకను తోడుకుపోయే వెసులుబాటును కల్పించారు. దాంతో పెద్దవాగు, మానేరు వాగు, గోదావరి నదీ పరిసరాల్లో ఈ అక్రమ క్వారీలు వెలిశాయి. విడిసిల ద్వారా క్వారీలను చేజిక్కించుకున్న వ్యక్తులు పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో మాత్రమే పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి తమ పని చక్కబెట్టుకున్నాక చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రతీ నెలా ఇసుక కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులకు 45 నుంచి 60 వేల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయ. అయితే గ్రామాభివృద్ధి పేరుతో స్థానిక సంస్థలకు పోటీగా పెత్తనం చెలాయిస్తున్న ఈ విడిసిలపై సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే గ్రామానికి సంబంధించిన లావాదేవీలన్నీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో ఇసుక క్వారీలకు టెండర్లు నిర్వహించి చౌకధరలకు కట్టబెట్టి లోపాయికారిగా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనేది నగ్న సత్యం. ఉదాహరణకు రాయికల్ మండలంలోని మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి ప్రాంతాల్లో ఇసుక తవ్వుకునేందుకు వేలం పాటలు నిర్వహించి కేవలం 2.45 లక్షల రూపాయలకే క్వారీని కట్టబెట్టడం గమనార్హం. అయితే సగటున ఈప్రాంతం నుంచి సదరు కాంట్రాక్టర్ రోజుకు 50 ట్రాక్టర్లకంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలిస్తూ విడిసికి చెల్లించిన మొత్తం రుసుంను రెండు, మూడు రోజుల్లోనే వసూలు చేసుకోగలిగారు. దీన్నిబట్టి విడిసిలు ఇసుక మాఫియా అనుబంధం ఎంత గాఢంగా బలపడి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే వీణవంక మండలం ఇప్పలపల్లి, కోర్కల్, కొండపాక, బోయినపల్లి మండలం వరదవెల్లి, శభాష్‌పల్లి, కొదురుపాక, కరీంనగర్, గంగాధర, బోయినపల్లి మండల సరిహద్దుల్లోని బావుపేట, ఒద్యారం, ఖాజీపూర్, మల్లాపూర్ తదితర ప్రాంతాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, జమ్మికుంట మండలం  విలాసాగర్, తనుగుల, తిమ్మాపూర్ మండలం రేణికుంట, కొత్తపల్లి తదితర ప్రాంతాల నుంచి సగటున రోజుకు ఒక్కో ఇసుక రీచ్ నుంచి 60 నుంచి 70 ట్రాక్టర్ల వరకు ఇసుక తవ్వకాలు, తరలింపు అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల చొప్పున ఇసుక విక్రయిస్తూ ఒక్కో కాంట్రాక్టర్ సగటున రోజుకు లక్ష రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతిలేని చిన్న చిన్న వాగులు, వంకలపై జరుగుతున్న తతంగం. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతీ ఒక్కరి హస్తం ఉన్నట్లు అర్థమవుతోంది. వీణవంక మండలం ఇప్పలపల్లిలో ఓ రాజకీయ నాయకుడు రోజుకు 60-70 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిన్నారు. అలాగే ఇదే మండలంలోని కోర్కల్‌లో ఓ స్థానిక నేత ఏకంగా మానేరులో జెసిబిలు మోహరించి ఇసుక తవ్వకాలను జరుపుతున్నారు. సదరు వ్యక్తి కూడా షరా మామూలుగా సంబంధిత అధికారులకు భారీగానే ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొండపాక గ్రామంలో ఓ నాయకుడు రోజుకు పది ట్రాక్టర్ల చొప్పున ఇసుకను తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి మానేరుకు వాహనాలు వెళ్లకుండా పెద్దఎత్తున కందకాలు తవ్వినప్పటికీ నిరాటంకంగా ఇసుక తరలింపు కొనసాగుతోంది.
ఇకపోతే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ముగ్గురు వ్యక్తులు గ్రామాభివృద్ధి కమిటీకి నాలుగు లక్షల 80 వేల రూపాయలు చెల్లించి సగటున రోజుకు 20-30 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ సదరు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులకు నెలకు రెండున్నర లక్షలకు పైగా మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక బోయినపల్లి మండలంలోని వరదవెల్లి, శాభాష్‌పల్లి, కొదురుపాక గ్రామాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి పెద్దమొత్తంలో కరీంనగర్ శివారులోని బావుపేట గ్రానైట్ క్వారీల్లో కుప్పలుగా పోసి అక్కడి నుంచి లారీల్లో రాజధానికి తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా ప్రతీ నెల లక్షల్లో అధికారులకు ముట్టజెబుతోంది. వారే అన్ని వర్గాలకు పర్సెంటేజీల చొప్పున మామూళ్లు పంచుతున్నట్లు ఆరోపణలున్నాయ.

మద్యం సిండి‘కేటు’లకు ఐటి దడ

కొత్త మలుపు తిరిగిన సిండికేట్ కుంభకోణం 
 
రంగంలోకి దిగనున్న ఆదాయ పన్నుల శాఖ?
 
టాస్క్ఫోర్సు చిట్టాలో జీరో వ్యాపారుల గుట్టు?
 

కరీంనగర్, డిసెంబర్ 17: మద్యం సిండికేట్ల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోందా? ఎసిబి దాడుల్లో భాగంగా వెంట తీసుకెళ్లిన రికార్డుల ఆధారంగా సిండి‘కేటు’ల గుట్టు బయటపెట్టేందుకు రంగం సిద్ధం అవుతోందా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన వివిధ శాఖల అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా ఈ కుంభకోణంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వార్తలు వస్తుండటం కలకలం రేకిత్తిస్తోంది. మరీ ముఖ్యంగా అడ్డగోలు ధరలకు మద్యం విక్రయించి అక్రమాలకు పాల్పడిన సిండికేట్లపై ఐటి కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో మద్యం వ్యాపారుల్లో దడ మొదలైంది. ఇక ఐటి నిజంగానే రంగంలోకి దిగినట్లైతే మద్యం వ్యాపారుల రూపంలో ఉన్న బడాబాబుల ఆస్తుల గుట్టు కూడా తేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎతె్తైతే ఏడాదికోసారి మద్యం షాపులు, గీత కార్మిక సంఘాలపై ఆరోపణలు వచ్చినపుడు మాత్రమే దాడులు నిర్వహించే స్పెషల్ టాస్క్ఫోర్సు(ఎస్‌టిఎఫ్) ఎసిబి ట్రాప్‌లో పడటం, ఎసిబి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో జీరో దందా చేస్తున్న ‘పెద్ద’ మనుషుల బండారం కూడా నమోదు చేసి ఉండటం వంటి పరిణామాలను భేరీజు వేసి చూస్తే రాబోయే రోజుల్లో సిండికేట్ల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనే చెప్పాలి. నిన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన సిండికేట్ నిర్వాహకులు ప్రమాదాన్ని గ్రహించి హుటాహుటిన రాజధానికి పరుగులు తీసి ఉచ్చు నుంచి బయట పడేందుకు మార్గానే్వషణ ప్రారంభించారు.ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి సహాయంతో బయట పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో ప్రకంపనలు రేకెత్తిస్తున్న ఈ మద్యం సిండికేట్ కుంభకోణం మూలాలు మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాలోనే వెలుగు చూసాయి. ఈ కుంభకోణంలో క్షేత్రస్థాయి అధికారుల నుండి మొదలుకుని రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో జిల్లాలో కొత్త చర్చకు తెరలేచింది. ఎసిబి దాడుల్లో భాగంగా సిండికేట్ వ్యాపారులకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ హార్ట్ డిస్క్‌లను సీజ్ చేసి తీసికెళ్లిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులకు సంబంధించిన రికార్డులలో నెలవారీ వ్యాపార లావాదేవీలు, ఖర్చుల వివరాలతోపాటు శాఖల వారీగా ఏయే శాఖలకు ఎంతెంత సొమ్ము ముట్టజెప్తున్నారో అందులో సవివరంగా నమోదు చేసి ఉండడంతో, ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న అధికారులు భయంతో వణికిపోతున్నారు. అంతేకాకుండా మద్యం వ్యాపారులకు సంబంధించి ఐఎంఎల్ డిపో నుండి కొనుగోలు చేసిన స్టాక్, ధరల వివరాలు తిరిగి అమ్మకాలకు సంబంధించిన ధరల వంటి వివరాలు కూడా సిండికేటు రికార్డులలో భద్రపరిచినట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఐఎంఎల్ డిఫో ద్వారా జారీ చేసే మద్యం ధరలకు రిటేల్ అమ్మకపు ధరలకు మధ్య భారీ తేడా ఉంటోంది. ఎంఆర్‌పి ధరలకు విక్రయించకుండా వ్యాపారులంతా సిండికేట్లుగా మారి వాస్తవ ధరలకు రెట్టింపు మొత్తానికి విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటైల్ షాపులకు కేసుల లెక్కన ఐఎంఎల్ డిపో మద్యం సరఫరా చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా బీర్ అమ్మకాలదే అగ్రస్థానం. ఉదాహరణకు బీరు అమ్మకాలను తీసుకుంటే 12 లైట్ బీర్లు కలిగిన కేసును 680 రూపాయలకు వ్యాపారులకు అందిస్తుండగా, స్ట్రాంగ్ బీరు కేసును 780 రూపాయలకు జారీ చేస్తుంది. విడిగా ఒక్కో లైట్ బీరు సిసాను 56 రూపాయలు, స్ట్రాంగ్ బీరును 65 రూపాయలకు అందిస్తుండగా వాటి ఎమ్మార్పీ ధర లైట్ బీరు 71 రూపాయలు కాగా, 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే స్ట్రాంగ్ బీరు ధర 82 రూపాయలు కాగా 110 రూపాయలకు విక్రయిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఎమ్మార్పీ ధర కంటే 50 శాతం నుంచి 75 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లకు సంబంధించి మద్యం విక్రయాలను ఎమ్మార్పీకి మించి అమ్మకూడదన్న నిబంధనలేవీ లేకపోవడంతో ఇష్టంవచ్చినట్లు ధరలు నిర్ణయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటేల్ షాపుల్లో మాత్రం ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా ఆయా షాపుల లైసెన్స్‌లను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులను మద్యం వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుని గతంలో ఎప్పుడూ లేనంత భారీగా మద్యం ధరలు పెంచి యథేచ్చగా దోపిడీ సాగిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఎసిబి దాడులతో ఆయా శాఖల సిబ్బంది ఎందుకు కళ్లుమూసుకున్నారన్న విషయం బట్టబయలు కావడంతో సిండికేట్లలో గుబులు మొదలైంది. ఇదంతా ఒకెతె్తైతే మహారాష్ట్ర, ఛత్తీష్‌ఘ్ఢ్ రాష్ట్రాలకు సమీపంలో ఉన్న సరిహద్దు మండలాలైన మంథని, మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, ముత్తారం తదితర మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన జీరో మద్యం పెద్ద ఎత్తున తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తూర్పు డివిజన్‌లో దాడులు నిర్వహించిన స్పెషన్ టాస్క్ఫోర్సు నజరానాలు పుచ్చుకుని దోషులను వదిలేశారన్న విమర్శలున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండిపడేందుకు ఎక్సైజ్ అధికారులు సహకరించారన్న విషయం తేటతెల్లమైంది. ఇదిలా ఉండగా సిండికేట్ రహస్యాలు చేజిక్కించుకున్న ఎసిబి మద్యం లావాదేవీల చిట్టాను ఆదాయ పన్నుల శాఖకు అప్పగించిన పక్షంలో జిల్లాలో ‘పెద్ద’ మనుషులుగా చలామణి అవుతున్న బినామీ మద్యం వ్యాపారుల అక్రమాల పుట్ట పగిలే అవకాశం లేకపోలేదు. గతంలో నిర్ణయించిన మద్యం షాపుల వేలం కంటే ఈ సారి రెట్టింపు ధర వెచ్చించి షాపులను చేజిక్కించుకున్న బడాబాబులకు అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కిడినుంచి వచ్చిందన్న అనుమానాలున్నాయి. బినామీ పేర్లపై జిల్లాకు చెందిన రాజకీయ ‘ప్రముఖులు’ నల్ల ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వైట్ మనీ చేసుకునే ప్రయత్నంలో బాగంగానే బినామీ పేర్లపై కోట్లు వెచ్చించి షాపులను దక్కించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ గనుక రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే బ్లాక్ మనీ బాబుల బండారం బయటపడక తప్పదనే చెప్పాలి.

ఖద్దర్..కాంట్రాక్టర్ చెట్టపట్టాల్..!

* కోట్లు కొల్లగొడుతున్న ఇసుక మాఫియా

 * ప్రజాప్రతినిధుల అనుచరులదే కీలక పాత్ర

 * అధికారులకూ నెల నెల మామూళ్లు

 * ఇందిరమ్మ పేరుతో రాజధానికి లారీల తరలింపు

ఆంధ్ర భూమి బ్యూరో
-----------------------

కరీంనగర్, డిసెంబర్ 20: ఖద్దర్ చొక్కాలు, కాంట్రాక్టర్‌లు కూడబలుక్కుంటే ఎలా ఆర్జించవచ్చో..ఇసుక మాఫియాను చూసి ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఇసుకేస్తే కాసులు రాలుతుండడంతో ఇసుక క్వారీలు మాఫియాకు బంగారు గనులుగా మారిపోయాయి. అధికారికంగా కొంత, అనధికారికంగా కొండంత అన్నట్లుగా రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లు అధికారులను నయానో, భయానో గుప్పిట్లో పెట్టుకొని యదేశ్ఛగా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన వేలం పాటల్లో తొమ్మిది ఇసుక రీచ్‌లకు సంబంధించి పది కోట్లకు పైనే ఆదాయం లభించింది. అయితే టెండర్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో అక్రమాలు జరిగాయంటూ కొంత మంది వ్యాపారులు హైకోర్టుకెక్కారు. దాంతో అక్కడ తవ్వకాలకు అధికారికంగా బ్రేక్ పడింది. ఇవి కాకుండా వెల్గటూరు మండలం ముత్తునూరు, ముక్కట్రావుపేట, రామగుండం మండలం పొట్యాల రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తవ్వేందుకు అనుమతించారు. జిల్లాలో ప్రస్తుతం అధికారిక ఇసుక క్వారీలు ఈ రెండు మాత్రమే. కానీ హైకోర్టు బ్రేక్ వేసిన తొమ్మిది రీచ్‌ల్లో ప్రధానమైన రీచ్‌గా భావిస్తున్న కొదురుపాక రీచ్ నుండి ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు యదేశ్ఛగా ప్రోక్లైన్లు పెట్టి మరీ ఇసుకను వందలాది లారీల్లో ప్రతీ రోజు రాజధానికి తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన తరువాత ఒక్కో లారీ ఇసుకకు సగటున 15 వేల నుంచి 18 వేల రూపాయల మధ్య వసూలు చేస్తారు. అలాగే స్థానికంగా ఇసుక ట్రాక్టర్ల చొప్పున విక్రయించడం జరుగుతుంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల మధ్య ఇసుక నాణ్యతను బట్టి వసూలు చేస్తారు. ఇలా జిల్లాలోని మానేరు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వందలాది అనధికారిక ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో తరలిస్తున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టలేని ధైన్య స్థితిలో ఉన్నారు. కళ్ల ముందు నుండి లారీలు తరలివెళ్తున్నా పట్టించుకోవడం లేదంటే ఇసుక మాఫియా అధికార యంత్రాంగాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో ఊహించవచ్చు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇసుక మాఫియా ప్రతీ నెలా గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా ఉన్నతాధికారి వరకు, కానిస్టేబుల్ మొదలుకొని పోలీస్ ఉన్నతాధికారుల వరకు లక్షల్లో మామూళ్లు ముట్టచెబుతూ పని చక్కబెట్టుకుంటున్నారనేది నగ్న సత్యం.
మాఫియాకు కాసులు కురిపిస్తున్న రియల్ భూం..

నాలుగేళ్ల క్రితం వరకు ఇసుక దందాపై జిల్లాలో పెద్దగా ఎవరికి అవగాహన ఉండేది కాదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భూం మొదలైన తరువాత భవన నిర్మాణాలు పెద్దఎత్తున ప్రారంభం కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఇసుక వ్యాపారులు కరీంనగర్ జిల్లాపై దృష్టి సారించడంతో దీని వెనుక సాగుతున్న ఆర్థిక లావాదేవీలపై జిల్లా నేతలు దృష్టి సారించారు. ఈ వ్యాపారంలో కోట్ల పంట పండుతోందనే విషయాన్ని పసిగట్టడంతో ఏడాది క్రితం నిర్వహించిన వేలం పాటల్లో నేరుగా తమ అనుచరుల పేరుతో ఇసుక దందాలోకి అడుగుపెట్టారు. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి అనుచరులే ఇసుక మాఫియాకి శ్రీకారం చుట్టారు. వేలం పాటల్లో కొన్ని రీచ్‌ల్లో వీరికి టెండర్లు దక్కినప్పటికీ హైకోర్టు ఉత్తర్వుల పుణ్యమా అని బ్రేక్ పడడంతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. దాంతో జిల్లాలో అనధికారికంగా వందకు పైగా రీచ్‌ల నుంచి యథేచ్ఛా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో రాజకీయంగా ఘర్షణలు తలెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయా సందర్భాల్లో ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు, పోలీస్ సిబ్బంది ఆ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయను చూసి మనకెందులే అన్న నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.
రూల్స్..గీల్స్ జాన్తానై..

జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతి లేదు. అత్యవసరం కింద ఇందిరమ్మ గృహాలకు, గ్రామాల్లో ఇళ్లు కట్టుకునే వారికి అధికారులు అనుమతిస్తారు. దానికనుగుణంగా ఇసుకను తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతిచ్చిన క్వారీలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో వెల్గటూర్ మండలంలో ముత్తునూర్. ముక్కట్రావ్‌పేట , రామగుండం మండలంలో పొట్యాల ఒకటి ఇసుక క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలి. దానికి అధికారులు అనుమతి ఇస్తారు. మిగితా చోట్ల ఇసుక తరలింపునకు అనుమతులు లేవు. కానీ జిల్లాలోని ఇల్లంతకుంట మండలం మల్లాపూర్ కొత్త బ్రిడ్జి వద్ద ఇష్టం వచ్చిన రీతిలో ఇసుకను తోడేస్తున్నారు. అలాగే బోయినపల్లి మండలం మాన్వాడ, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, మంథని, మహదేవ్‌పూర్, జమ్మికుంట మండలం వావిలాల, వీణవంక వద్ద ఉన్న మానేరు నుండి ఈ ఇసుక తరలింపును చేస్తున్నారు. అలాగే కరీంనగర్ నగర శివారు నుంచి కూడా పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు, ఉద్యోగుల సహకారంతో మాఫియా ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుతూ యదేశ్ఛగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. గత నలబై రోజులుగా పెద్దఎత్తున జరుగుతున్న ఈ దందాలో వందలాది లారీలు హైదరాబాద్‌కు తరలిపోయాయి. జిల్లాలోని పలుచోట్ల నుండి కళ్లముందే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో అక్రమంగా ఇసుక తరలించే లారీలను, ట్రాక్టర్లను సీజ్ చేసి 5వేల నుంచి 15వేల వరకు జరిమానా వేసేవారు. ట్రాక్టర్స్, లారీలను సీజ్ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అక్రమార్కులు వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందాలో వచ్చిన డబ్బుల్లోంచి కొంత శాతం అధికార పార్టీ నేతలకు రాయల్టీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. అదేకాకుండా ఆయా గ్రామాల పరిదిలో ఇసుకను తీసినప్పుడు అడ్డుకోకుండా ఉండేందుకుగాను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులకు కూడా కొంత ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఇసుకను తోడేందుకు జెసిబిలను వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టకపోతే భూగర్భ జలాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

ఇసుక తీస్తే ఇక ఉక్కుపాదమే!

* ‘్భమి’ కథనాలతో అధికారుల్లో కదలిక * అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు * జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు * నిఘాకోసం ప్రత్యేక బృందాలు * నేడో, రేపో విడిసిలపైనా కేసులు * వెల్లడించిన జాయింట్ కలెక్టర్


కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇసుక అక్రమమైనింగ్‌కు ప్రధానంగా అధికారిక వేలం పాటలు నిర్వహించకపోవడమే కారణమని భావించి అనుమతికోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు నిర

ఇసుక తీస్తే ఇక ఉక్కుపాదమే!

* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
 
-ఆంధ్రభూమి బ్యూరో
 

కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇసుక అక్రమమైనింగ్‌కు ప్రధానంగా అధికారిక వేలం పాటలు నిర్వహించకపోవడమే కారణమని భావించి అనుమతికోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు నిర్ణయించారు.

Saturday, December 17, 2011

కదులుతున్న ‘ఎక్సైజ్ ఎస్టీఎఫ్’డొంక


కరీంనగర్, డిసెంబర్ 16: కరీంనగర్ జిల్లాలో జరిగిన ఎసిబి దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటుకు చెందిన ‘ప్రత్యేక నిఘా విభాగం’ (ఎస్టీఎఫ్) అధికారులు పట్టుబడడంతో తీగ లాగిన ఎసిబికి రాష్టవ్య్రాప్తంగా ఉన్న డొంకలన్నీ కదలడం ప్రారంభించాయి. ఈ నెల 13న ఎస్టీఎఫ్ సిబ్బంది అవినీతిపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎసిబి అధికారులకు ఓ ఉన్నతాధికారికి చెందిన లాప్‌టాప్ లభించింది. దాన్ని డీకోడింగ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్ల నుంచి రావాల్సిన మామూళ్లకు సంబంధించిన పూర్తి జమా, ఖర్చు పద్దుల చిట్టా బట్టబయలైంది. దాంతో ఈ నెల 13న హైదరాబాద్ ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు కరీంనగర్ జిల్లాలో మెరుపు దాడులు జరిపారు. దాడుల్లో మూడు లక్షల 72 వేల నగదు లభ్యమైంది. విచారణలో ఆ అధికారులు ఇచ్చిన సమాచారంతో అదే రోజు రాత్రి కరీంనగర్ సిండికేట్ కార్యాలయంపై దాడులు నిర్వహించి లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్‌డిస్ట్‌లను స్వాధీనం చేసుకొని సమాచారాన్ని సేకరించింది. కోట్లాది రూపాయలు ముడుపుల రూపంలో చేతులు మారుతున్నాయన్న విషయం తేటతెల్లం కావడంతో వెంటనే అప్రమత్తమై శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా మద్యం సిండికేట్ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఎసిబి అధికారులకు దిమ్మదిరిగిపోయే సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని మిగతా సిండికేట్లు, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతాల్లోని సిండికేట్ కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో లభ్యమైన వివరాల ఆధారంగా అవినీతికి సంబంధించి మరింత కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. లాప్‌టాప్, సిండికేట్స్ రికార్డుల్లో లభ్యమైన సమాచారం ఆధారంగాప్రధానంగా ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ విభాగాలతో పాటు కొంత మంది పాత్రికేయుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను సమాచారం కోరగా దీంతో ప్రమేయం ఉన్న అధికారులపై విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.

Friday, December 2, 2011

రెవెన్యూలో బది‘లీల’లు..

* కాసులిచ్చుకున్న వారికి కోరుకున్న పోస్టింగ్‌లు? * దళిత అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు! * అసంతృప్తితో రగులుతున్న డిప్యూటీ తహశీల్దార్లు

కరీంనగర్, నవంబర్ 29: కక్షసాధింపులో రెవెన్యూ శాఖ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇటీవల రెండు దఫాలుగా జరిగిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ల బదిలీల ప్రహనంలో రెండవ దఫా జరిగిన బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. కాసులిచ్చుకున్న వారికే వారు కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చి దళిత, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు కట్టబెట్టారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఇంకా 19 డిప్యూటీ తహశీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి పొందిన అభ్యర్థులకు వారు పని చేసిన చోటే పోస్టింగ్‌లు ఇవ్వడం ఈ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ కాసుల తతంగంలో రెవెన్యూలోని కలెక్టరేట్ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిప్యూటీ తహశీల్దార్ నుంచి లక్ష రూపాయలు మొదలుకొని మూడు లక్షల వరకు మామూళ్లు పుచ్చుకొని వారికి అనువైన పోస్టింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా పగ్గాలు చేపట్టిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో 24 మంది తహశీల్దార్లు, 27 మంది డిప్యూటీ తహశీల్దార్లు స్థాన భ్రంశం కల్పించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ఈ బదిలీలపై కించిత్ కూడా అసంతృప్తి కన్పించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆ 24 మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు సుదీర్ఘకాలం అదే చోట పని చేయడంతో పాటు స్వస్థలాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. దాంతో కలెక్టర్ వారిపై బదిలీ వేటు వేయడం పట్ల రెవెన్యూలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాకుండా ప్రజల నుండి కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది మరిచిపోకముందే రెండవ దఫా జరిపిన బదిలీల ప్రక్రియలో సీన్ రివర్స్ అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 డిప్యూటీ తహశీల్దార్లు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16 మంది సీనియర్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించి డిప్యూటీ తహశీల్దార్లుగా ఆయా స్థానాల్లో భర్తీ చేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ అసిస్టెంట్లుగా చాలా కాలం వివిధ హోదాల్లో పని చేసిన అభ్యర్థులకు మళ్లీ అక్కడే డిటిగా పదోన్నతి ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కలెక్టర్ ఏ అంశాన్నయితే ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారో డిటిల నియామకానికి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న గుస గుసలు విన్పిస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పి ‘దక్షిణ’ చెల్లించుకున్న వారికి పోస్టింగ్‌లు ఇప్పించడంలో కృతకృత్యులైనట్లు చెబుతున్నారు. ఇందులో జరిగిన బదిలీలను కొన్ని గమనిస్తే పై అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డిటిలకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఆయా సామాజిక వర్గాల సిబ్బంది తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ఎంతైనా ప్రస్తావనార్హం. ఇందులో వసంత అనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారిణికి సీనియర్ అసిస్టెంట్ నుంచి డిటిగా పదోన్నతి ఇచ్చిన తరువాత ఆమె పెగడపల్లి స్థానాన్ని కోరుకున్నారు. అది కాకపోతే కనీసం కరీంనగర్ పరిసర మండలాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఆమెకు హుస్నాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చి అన్యాయం చేశారని ఆ వర్గానికి చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.వనజాక్షి అనే వికలాంగురాలైన సీనియర్ అసిస్టింట్‌కు పదోన్నతి కల్పించిన అధికారులు ఆమె కోరుకున్న కరీంనగర్ లేదా జగిత్యాల పోస్టింగ్ ఇవ్వకుండా ప్రాధాన్యత లేని వేములవాడ ఎన్నికల డిప్యూటి తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌లోనే సీనియర్ అసిస్టెంట్‌గా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలంగా పని చేసిన అంజయ్యకు పదోన్నతి కల్పించిన తరువాత నిబంధనల ప్రకారం వేరే ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టింగ్‌ను ఇవ్వాల్సి ఉండగా ఈయన విషయంలో అధికారులు ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపించారు. కరీంనగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా మరో నెల రోజుల్లో పదవీవిరమణ చేయాల్సి ఉన్న రాంనారాయణ స్థానానికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా ఆయన రిటైర్డ్ కాకుండానే అంజయ్యకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని, జిల్లావ్యాప్తంగా ఇంకా 19 స్థానాలు ఖాళీగా ఉన్నా ఖాళీ కాని స్థానానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే మెట్‌పల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా దశాబ్ధానికి పైగా మెట్‌పల్లిలో విధులు నిర్వహించిన నాగార్జున అనే ఉద్యోగిపై కూడా అధికారులు వల్లమాలిన అభిమానాన్ని ప్రదర్శించారు. అక్కడ ఆయనపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పక్కన పెట్టి తిరిగి మెట్‌పల్లికే డిప్యూటీ తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల పట్టణానికే చెందిన రాజేశ్వర్ అనే సివిల్ సప్లరుూస్ డిప్యూటీ తహశీల్దార్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సుమారు దశాబ్ధకాలానికి పైగా పని చేశారు. ఏడాది క్రితమే ఆయనకు గంగాధర సివిల్ సప్లయస్ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తుండగానే తన పలుకుబడిని ఉపయోగించి స్వస్థలమైన జగిత్యాలలో పని చేసే నాగరాజమ్మ అనే ఉద్యోగినిని బదిలీ చేయించి మరీ అదే పోస్టింగ్‌ను పొంది అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ తతంగం అంతా పరిశీలిస్తే రెండవ దఫా జరిగిన బదిలీల ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విషయం రూఢీ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారిస్తారో  లేదో వేచి చూడాల్సిందే !!

రెవెన్యూలో బది‘లీల’లు..

* కాసులిచ్చుకున్న వారికి కోరుకున్న పోస్టింగ్‌లు? * దళిత అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు! * అసంతృప్తితో రగులుతున్న డిప్యూటీ తహశీల్దార్లు


కరీంనగర్, నవంబర్ 29: కక్షసాధింపులో రెవెన్యూ శాఖ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇటీవల రెండు దఫాలుగా జరిగిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ల బదిలీల ప్రహనంలో రెండవ దఫా జరిగిన బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. కాసులిచ్చుకున్న వారికే వారు కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చి దళిత, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు కట్టబెట్టారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఇంకా 19 డిప్యూటీ తహశీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి పొందిన అభ్యర్థులకు వారు పని చేసిన చోటే పోస్టింగ్‌లు ఇవ్వడం ఈ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ కాసుల తతంగంలో రెవెన్యూలోని కలెక్టరేట్ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిప్యూటీ తహశీల్దార్ నుంచి లక్ష రూపాయలు మొదలుకొని మూడు లక్షల వరకు మామూళ్లు పుచ్చుకొని వారికి అనువైన పోస్టింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా పగ్గాలు చేపట్టిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో 24 మంది తహశీల్దార్లు, 27 మంది డిప్యూటీ తహశీల్దార్లు స్థాన భ్రంశం కల్పించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ఈ బదిలీలపై కించిత్ కూడా అసంతృప్తి కన్పించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆ 24 మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు సుదీర్ఘకాలం అదే చోట పని చేయడంతో పాటు స్వస్థలాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. దాంతో కలెక్టర్ వారిపై బదిలీ వేటు వేయడం పట్ల రెవెన్యూలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాకుండా ప్రజల నుండి కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది మరిచిపోకముందే రెండవ దఫా జరిపిన బదిలీల ప్రక్రియలో సీన్ రివర్స్ అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 డిప్యూటీ తహశీల్దార్లు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16 మంది సీనియర్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించి డిప్యూటీ తహశీల్దార్లుగా ఆయా స్థానాల్లో భర్తీ చేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ అసిస్టెంట్లుగా చాలా కాలం వివిధ హోదాల్లో పని చేసిన అభ్యర్థులకు మళ్లీ అక్కడే డిటిగా పదోన్నతి ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కలెక్టర్ ఏ అంశాన్నయితే ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారో డిటిల నియామకానికి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న గుస గుసలు విన్పిస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పి ‘దక్షిణ’ చెల్లించుకున్న వారికి పోస్టింగ్‌లు ఇప్పించడంలో కృతకృత్యులైనట్లు చెబుతున్నారు. ఇందులో జరిగిన బదిలీలను కొన్ని గమనిస్తే పై అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డిటిలకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఆయా సామాజిక వర్గాల సిబ్బంది తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ఎంతైనా ప్రస్తావనార్హం. ఇందులో వసంత అనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారిణికి సీనియర్ అసిస్టెంట్ నుంచి డిటిగా పదోన్నతి ఇచ్చిన తరువాత ఆమె పెగడపల్లి స్థానాన్ని కోరుకున్నారు. అది కాకపోతే కనీసం కరీంనగర్ పరిసర మండలాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఆమెకు హుస్నాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చి అన్యాయం చేశారని ఆ వర్గానికి చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.వనజాక్షి అనే వికలాంగురాలైన సీనియర్ అసిస్టింట్‌కు పదోన్నతి కల్పించిన అధికారులు ఆమె కోరుకున్న కరీంనగర్ లేదా జగిత్యాల పోస్టింగ్ ఇవ్వకుండా ప్రాధాన్యత లేని వేములవాడ ఎన్నికల డిప్యూటి తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌లోనే సీనియర్ అసిస్టెంట్‌గా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలంగా పని చేసిన అంజయ్యకు పదోన్నతి కల్పించిన తరువాత నిబంధనల ప్రకారం వేరే ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టింగ్‌ను ఇవ్వాల్సి ఉండగా ఈయన విషయంలో అధికారులు ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపించారు. కరీంనగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా మరో నెల రోజుల్లో పదవీవిరమణ చేయాల్సి ఉన్న రాంనారాయణ స్థానానికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా ఆయన రిటైర్డ్ కాకుండానే అంజయ్యకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని, జిల్లావ్యాప్తంగా ఇంకా 19 స్థానాలు ఖాళీగా ఉన్నా ఖాళీ కాని స్థానానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే మెట్‌పల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా దశాబ్ధానికి పైగా మెట్‌పల్లిలో విధులు నిర్వహించిన నాగార్జున అనే ఉద్యోగిపై కూడా అధికారులు వల్లమాలిన అభిమానాన్ని ప్రదర్శించారు. అక్కడ ఆయనపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పక్కన పెట్టి తిరిగి మెట్‌పల్లికే డిప్యూటీ తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల పట్టణానికే చెందిన రాజేశ్వర్ అనే సివిల్ సప్లరుూస్ డిప్యూటీ తహశీల్దార్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సుమారు దశాబ్ధకాలానికి పైగా పని చేశారు. ఏడాది క్రితమే ఆయనకు గంగాధర సివిల్ సప్లయస్ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తుండగానే తన పలుకుబడిని ఉపయోగించి స్వస్థలమైన జగిత్యాలలో పని చేసే నాగరాజమ్మ అనే ఉద్యోగినిని బదిలీ చేయించి మరీ అదే పోస్టింగ్‌ను పొంది అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ తతంగం అంతా పరిశీలిస్తే రెండవ దఫా జరిగిన బదిలీల ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విషయం రూఢీ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారిస్తారో

v | రెవెన్యూలో బది‘లీల’లు.. | Andhra Bhoomi

v రెవెన్యూలో బది‘లీల’లు.. Andhra Bhoomi

Tuesday, November 29, 2011

చిదంబర రహస్యం

January 1st, 2011

‘చిదంబర రహస్యం’ గురించి వినివిని అదేమిటో తెలుసుకుందామని పోయినవాళ్లకు చిదంబరం గుళ్లో ఒక తెర కనపడుతుంది. దాని వెనక ఆకాశలింగం ఉన్నదంటారు. కాని ఏమీ కనపడదు. అదేమంటే శివుడున్నది ఆకాశరూపంలో కదా, అందుకని కంటికి కనపడడంటారు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కూడా అలాంటి చిదంబర రహస్యమే.
కమిటీ రిపోర్టు డిసెంబరు 31 కల్లా ఠంచనుగా వచ్చేస్తున్నదనేసరికి రాష్ట్రంలో ఎక్కడెక్కడి వారికీ బ్లడ్‌ప్రెషరు పెరిగింది. తెలంగాణపై తాడోపేడో తేలిపోతుంది; తెలంగాణ ఇవ్వాలన్నా, వద్దన్నా అటో ఇటో భూమి బద్దలవుతుంది; రాష్ట్రం అల్లకల్లోలమవుతుంది కాబోలని తెలివిలేనివాళ్లు తల్లడిల్లిపోయారు. చేతికందిన నివేదికను అఖిలపక్ష భేటీలో బట్టబయలు చేస్తామని చిదంబరామాత్యుడు అనేసరికి ఇప్పుడందరూ ఊపిరి ఉగ్గబట్టుకుని జనవరి 6 మీద దృష్టి పెట్టారు. ఆ రోజున ఏమి తేలుతుందో, కొంపలెక్కడ మునుగుతాయోనని చాలా మంది తెగ హడలి చస్తున్నారు.
ఇది అనవసరపు భయం. ఆ రోజున ఏమీ తేలదు. ఎవరి కొంపా మునగదు. పేరు గొప్ప కమిటీ రిపోర్టులో ఏమీ లేదన్నదే చిదంబరం పెట్టిన పార్టీల పేరంటంలో బయటపడబోయే ‘చిదంబర రహస్యం’!
ఇది చెప్పటానికి దివ్యదృష్టి అక్కర్లేదు. కొంచెం కామన్‌సెన్సు ఉంటే చాలు.
తెలంగాణ ఇవ్వాలన్నా, ఇవ్వవద్దన్నా మొట్టమొదట మునిగేది కాంగ్రెసు కొంప. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో దానికి ఉప్పు పుట్టదు. ఇవ్వకపోతే తెలంగాణలో దానికి పుట్టగతులుండవు. ఇచ్చినా- గతిలేక ఇచ్చారనే తెలంగాణ వాళ్లు అనుకుంటారు; కె.సి.ఆర్.కే వీరపూజ చేస్తారు తప్ప కాంగ్రెసును ఏనుగు అంబారీమీద ఊరేగించి నెత్తినెక్కించుకోరు.
కాబట్టి ఏమీ తేలకుండా ఉండటమే కాంగ్రెసు వారికి కావలసింది. తెలంగాణను ఇచ్చెయ్యమనో, ఇవ్వవద్దనో శ్రీకృష్ణ కమిటీ కరాఖండిగా చెబితే... ఆ సంగతి బయటికొస్తే కాంగ్రెసు ప్రభువులు ఇరుకున పడతారు. కమిటీ చెప్పిన ప్రకారం అడుగు వేయకపోతే పాలకపక్షానికి పరువు దక్కదు. ఏదో ఒక ప్రాంతం ప్రజలు మొగాన పేడ నీళ్లు కొట్టక మానరు. దానికి భయపడి అడుగువేస్తే రెండో ప్రాంతం వాళ్లు అదే సత్కారం చేయకుండా ఉండరు. ఏమి చేసినా, చేయకున్నా తంటాయే అవుతుంది. అలాంటి సంకటాన్ని తెలివిమీరిన చిదంబరం కోరి కొని తెచ్చుకోడు. కమిటీ రిపోర్టులో తమను ఇబ్బందిపెట్టే అంశమేదైనా ఉంటుందన్న అనుమానం ఏకోశాన ఉన్నా చూస్తాం, ఆలోచిస్తాం, త్వరలో చెబుతాం అనే ఆయన దాట వేస్తాడు. అలా కాకుండా రిపోర్టు ఈ చేత్తో అందుకుని, ఆ చేత్తో బయటపెట్టేస్తానని బేఫర్వాగా అనడాన్నిబట్టే అందులోని సరుకు గురించి సర్కారుకు ఎలాంటి దిగులూ లేదని స్పష్టం.
కమిటీ రిపోర్టులో ఏమున్నదో చదివితే గదా తెలిసేది? మీడియా వాళ్లందరి ముందూ కమిటీ వాళ్లు రిపోర్టు తన చేతిలో పెట్టగానే, దాని అట్ట అయినా తీసి చూడకుండానే అన్ని పార్టీల్నీ పిలిచేస్తాం, రిపోర్టు చూపిస్తాం అని చిదంబరం ఏ ధీమాతో అన్నాడు? తీరిగ్గా చదివి, ఏమి చేయాలన్నది ఆలోచించి ఏ మూడు నెలల తరవాతో చెబుతామని హోంమంత్రి అన్నా ఎవరూ ఆక్షేపించగలిగే వాళ్లు కాదు. ఆ వెసులుబాటు తీసుకోకుండా వారానికల్లా రిపోర్టు అందరి ముందూ పెట్టేస్తామని అక్కడికక్కడే ఆయన ఎందుకు ప్రకటించేశాడు? తీరా తెరిచి చూశాక ఇరకాటం ఎదురవుతే ప్రభుత్వం పులుసులో పడదా?
పడదు. ఆ సంగతి చిదంబరానికి బాగా తెలుసు. రిపోర్టులో ఏమున్నదీ అతీంద్రియ శక్తితో గ్రహించి కాదు. రిపోర్టు కాపీని ముందురోజే రహస్యంగా తెప్పించుకుని చదివాడేమోననీ అనుమానించక్కరలేదు. శ్రీకృష్ణకమిటీకి పురమాయించిన పని ఏమిటన్నది ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు చిదంబర రహస్యం మిస్టరీ ఇట్టే తెలిసిపోతుంది.
కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాలు ఇవి:
1. తెలంగాణ రాష్ట్ర వేర్పాటు డిమాండు దృష్ట్యా రాష్ట్రంలో పరిస్థితిని పరీక్ష చెయ్యటం.
2.రాష్ట్రం పుట్టినప్పటి నుంచీ నడిచిన పరిణామాలను, వివిధ ప్రాంతాల అభివృద్ధిపై వాటి ప్రభావాలను సమీక్షించటం.
3.మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనారిటీలు, ఎస్.సి.లు, ఎస్.టి.లు తక్కుంగల వర్గాల ప్రజలపై ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని పరీక్షించడం.
4. పైన పేర్కొన్న మూడు విషయాలను పరిశీలించేటప్పుడు పట్టించుకోవలసిన కీలకాంశాలను గుర్తించటం.
5. అన్ని వర్గాల ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను, ఇతర సంస్థలను పై విషయాల్లో సంప్రదించి ప్రస్తుత క్లిష్ట పరిస్థితిని ఎలా గట్టెక్కాలన్న దానిపై అభిప్రాయాలు సేకరించటం.
6. పరిశ్రమ, వ్యాపార, కార్మిక, కర్షక సంస్థలను, మహిళా, విద్యార్థి సంఘాలను సంప్రదించి, వివిధ ప్రాంతాల అభివృద్ధికి ఏమి చేయాలంటారని అభిప్రాయాలను పోగెయ్యటం.
7. ఉచితమని తోచిన సలహాలు, సిఫార్సులు ఇవ్వడం.
ఇంతే సంగతులు.
వీటిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలో వద్దో తేల్చమని కమిటీని అడిగిందెక్కడ? ఇవ్వాల్సి వస్తే ఎలా ఇవ్వాలో, ఏమి చెయ్యాలో చెప్పమని కోరిందెక్కడ? ఏ కమిటీ అయినా తనకు అప్పగించిన పనినే, అప్పగించిన మేరకే కదా చేసేది? అందరినీ కలవమన్నారు. కలిసింది. అభిప్రాయాలు సేకరించమన్నారు. కట్టల కొద్దీ రాబట్టింది. వారలా అన్నారు, వీరిలా అన్నారు, కావాలంటే అలా చేయొచ్చు, కాదనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఏమి చేస్తారన్నది మీ ఇష్టం అని చేటభారతమంతటి రిపోర్టులో కమిటీ చివరికి చేట కొడుతుంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తుంది. నిరుడు జనవరి 5 ఢిల్లీ అఖిలపక్ష పేరంటంలో వదిలేసిన చోటికి రేపు జనవరి 6 అఖిలపక్షం పేరంటంలో తెలంగాణ వ్యవహారం మళ్లీ చేరుతుంది. రిపోర్టు దాఖలుతో కమిటీ పేరిట 11 నెలలపాటు సాగిన విరామ సంగీతం ముగుస్తుంది. మళ్లీ పార్టీకి ఇద్దర్ని చొప్పున ఢిల్లీ పేరంటానికి పిలిచారు కనుక ప్రతి పార్టీ షరామామూలుగా, రెండునోళ్లతో, రెండు నాలికలతో మాట్లాడుతుంది. చివరికి ఏదీ తేల్చలేక అంతా కలిసి ఇంకో కమిటీనో, కమిషనునో ఆవాహన చేసి సరికొత్త విరామ సంగీతం మొదలెట్టిస్తారు. పార్టీలూ హాపీ, చిదంబరమూ హాపీ. జనానికి జోల. కాంగ్రెసుకు హేల. పార్టీల పవరు పాలిటిక్సు షరామామూలు. ప్రజల చెవిలో పూలు. భలే!
-సాక్షి

యువర్ అటెన్షన్ ప్లీజ్...

---సాక్షి

తెలంగాణ ఎక్కదలిచిన రైలు ఒక జీవితకాలం లేటు
మరికాసేపట్లో ప్లాట్‌ఫాం మీదికి వస్తుందని అనౌన్స్‌మెంటు అయిన రైలు రావడం అరగంటో గంటో ఆలస్యమైతేనే జనానికి చెడ్డచిరాకు వేస్తుంది. అదిగో వచ్చేస్తున్నదని 2009లో అనౌన్స్‌మెంటు అయిన స్టేట్ ఎక్స్‌ప్రెసు ఏణ్నర్థందాటినా ఇంకా అజాపజా లేదంటే చూచిచూచి కళ్లు కాయలు కాచిన తెలంగాణ జనానికి ఇంకెంత చిర్రెత్తాలి?
మామూలు రైలు ఎనౌన్స్ చేశాక కూడా లేటుఅవటానికి బలమైన కారణాలే ఉండొచ్చు. అనుకోని అవాంతరాలను నివారించటం ఎవరి చేతుల్లోనూ ఉండకపోవచ్చు. తెలంగాణ బండి సంగతి వేరు. దానికి ఢిల్లీ స్టేషనులో సిగ్నలు ఇవ్వకుండానే, ఇంకా కూత వెయ్యకముందే, అదిగో వచ్చేస్తోందని హైదరాబాదులో దొంగ అనౌన్స్‌మెంట్లు వరసపెట్టి మొదలవుతాయి. ఆడ నుంచి ఈడ దాకా అంతా బూటకమే; అందరిదీ నాటకమే.
జగమెరిగిన కె.సి.ఆర్. దీక్షతో తాజా అంకం ఆరంభం. అసలా దీక్షే నాటకమని గిట్టనివారి అభియోగం. దీక్షవల్ల తెలంగాణ అట్టుడుకుతున్న సమయాన ‘సైకిల్’బాబులోని సహజనటుడు బయటికి వచ్చాడు. తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని అసెంబ్లీలో సర్కారును ఎంచక్కా నిలదీశాడు. అది చూసి ఢిల్లీ దర్శకులు కారక్టర్ యాక్టర్ రోశయ్యకు చెప్పి ఆల్ పార్టీ పేరంటం పెట్టించారు. అన్ని పార్టీల వాళ్లూ తమతమ నటనా కౌశలాన్ని చూపించి తెలంగాణకు ఓకే కోరస్ పాడారు. అక్కడితో తెరదించకుండా, ‘సరే అయితే తెలంగాణ ఇచ్చేస్తున్నాం’ అని డైరక్టర్లు పిడుగులాంటి డైలాగు వేశారు. దాంతో రాష్ట్ర నటులకు కళ్లు తిరిగాయి. నాటకం డైలాగును పట్టుకుని నిజమంటే ఎట్లా అని వాళ్లు తెగ గింజుకున్నారు.
అక్కడి నుంచి ఢిల్లీ డ్రామా రసకందాయంలో పడింది. అసలు ప్లాట్‌ఫాం మీదికే తేని తెలంగాణ బండికి ఉత్తుత్తి సిగ్నల్ ఇచ్చినట్టు నటించి మేటి నటుడు చిదంబరం మాయ ప్రకటన చేశాడు. ‘హత్తెరీ’ అని సీమాంధ్ర నటులు- అనుకున్నట్టే దారికాచి పట్టాలకు అడ్డంపడ్డారు. రాని రైలును ఆపేసినట్టు నానాగత్తర అయ్యాక - ఎందుకు ఆగిందో, ఏమి చెయ్యాలో కనుక్కోమని శ్రీకృష్ణా అండ్ కంపెనీకి వేషాలేసి పంపారు. విచారణ ఘట్టాన్ని ఏడాది రక్తి కట్టించాక, కర్ర విరగకుండా, పాము చావకుండా వాళ్లేమో బహిరంగంలో అతి రహస్యాన్ని చొప్పించి, జంతర్‌మంతర్ చేశారు. రంగం మళ్లీ ఢిల్లీకి మళ్లింది.
కమిటీ రిపోర్టు ఇలా అందగానే, అలా తెలంగాణ ఇచ్చేయబోతున్నట్టు బిల్డప్ ఇచ్చిన కేంద్రం వారు రిపోర్టు వచ్చి అర్ధ సంవత్సరమైనా ఏదీ తేల్చరు. అటో, ఇటో, ఎటో నిర్ణయించాల్సిన సర్కారు- పార్టీల కోళ్లు వచ్చి కూస్తే తప్ప తెలంగాణ తెల్లవారదని మిషభిషలు పెడుతుంది. పార్టీలను కేకేసి రిపోర్టు చేతిలో పెట్టి పంపించి ఆరు నెలలు గడిచాక ఏమి చెయ్యాలో చెప్పడానికి పార్టీల పేరంటం మళ్లీ పెడతామన్న మాట ‘స్పీడ్ స్టార్’ చిదంబరం నోట జాలువారింది. ముహూర్తం కుదరడానికి ఇంకో ఆరు నెలలు పట్టవచ్చు. వాయిదాల పద్ధతిలో భేటీలు వేశాక ఫాయిదాలేదని ఎప్పటికి తేలుస్తారో, తదుపరి కర్తవ్యాన్ని ఎలా నిర్ణయిస్తారో రంగస్థలం మీద చూడాలి.
వాయిదాలు ఎన్ని వేసినా, నాటకాలు ఎన్ని ఆడినా కనీసం మూడేళ్లలోపల, 2014 ఎన్నికల నాటికైనా తెలంగాణను ఇవ్వక ఏమి చేస్తారన్న ధీమా ఇప్పటిదాకా తెలంగాణ వాళ్లకు ఉంది. చూడబోతే అదీ వెర్రి ఊహే అని తేలేటట్టుంది.
ఆశ పెట్టిన రాష్ట్రం తీరా తమకు ఇవ్వకపోతే తెలంగాణ జనం కోపగించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు మాడు పగలగొట్టటం ఖాయమే. వై.ఎస్. వారి ధాటికి ఎలాగూ సీమాంధ్రలో ధరావతులు దక్కే ఆశలేని స్థితిలో తెలంగాణలో కూడా దేవిడీమన్నా అయతే సెంటర్లో కాంగ్రెసు అధికారానికి కష్టమే. కాని దానికి మించిన ఈతిబాధ ‘పైవాళ్ల’కు ఇంకొకటి వచ్చేట్టుంది.
తెలంగాణను ఇచ్చేస్తున్నారనగానే దేశంలో ఎక్కడెక్కడి రాష్ట్రాల్లోనూ వేర్పాటు ఆశలు మోసులెత్తాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ను విడగొట్టి డార్జిలింగు రాజధానిగా గూర్ఖాలాండ్‌ను ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నవాళ్లకు మరీ హుషారు వచ్చింది. బెంగాల్‌లో ఉన్నది కమ్యూనిస్టు గవర్నమెంటు అయితే ఢిల్లీ వారికి ఏ బాధా లేకపోయేది. కాని ఇప్పుడక్కడ గద్దె మీద ఉన్నది మమతా దీదీ. సెంటర్లో యు.పి.ఎ. గుడారానికి ఆమె పెద్ద అండ. శుభమా అని రాజ్యానికి రాగానే వేర్పాటు కొరివి తనకెందుకని... తెలంగాణనిచ్చి తనకు కష్టాలు కొని తేవద్దని దీదీ నిక్కచ్చిగా చెప్పింది. ఏ కామ్రేడ్లో, మావోలో పుణ్యం కట్టుకోవటంవల్ల వేర్పాటు చిచ్చుపుట్టి 2014 ఎన్నికల్లో మమతమ్మ పుట్టి మునిగితే యు.పి.ఎ. డేరాకు పెద్ద దెబ్బే.
అలాగే తెలంగాణనిస్తే విదర్భకూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వరన్న పంతం పెరుగుతుంది. అది మరాఠా మల్లుడు శరద్‌పవార్‌కు నష్టం. ఆ పవార్ కూడా యు.పి.ఎ. పవరుకు పెద్ద ఊతం. కాబట్టి ఆయనను చిక్కుల్లో పెట్టే పనికీ కాంగ్రెసు నేతలు సాహసించలేరు. అన్నట్టు ఉత్తరప్రదేశ్‌ను మూడు ముక్కలు చెయ్యాలని యు.పి.రాణి మాయావతి ఎప్పటినుంచో అడుగుతున్నది. తెలంగాణనిస్తే ఆమె కూడా గొంతు పెద్దది చేస్తుంది. ఆ అమ్మ కాంగ్రెసుకు ఎగస్పార్టీ. మాయదారి మాయకు లాభమైనది ఆటోమెటిగ్గా తమకు నష్టం కావచ్చు కనుక ఆమె ముచ్చటతీర్చటం కాంగ్రెసు వారికి ఇష్టం ఉండదు. ‘హరితప్రదేశ్’మీద కాంగ్రెసు మిత్రుడు అజిత్‌సింగు కూడా మనసుపడుతున్నమాట నిజమే. కాని - మిత్రుడుకోరేదీ శత్రువుకోరేదీ ఒకటే అయినప్పుడు ఇవ్వకపోవటమే రాజకీయం.
ఈ ప్రకారంగా ‘మమతా ఎక్స్‌ప్రెసు’ అడ్డంతగలటంవల్ల ‘తెలంగాణ పాసింజరు’ పట్టాలు ఎక్కకుండానే ఆగిపోయింది. అయినా ఆ సంగతి ఢిల్లీ మహానటులు చెప్పరు. ఎన్నిచేసినా తెలంగాణ ఉద్యమాలు ఆగేట్టు లేవు కనుక వాటిని జోకొట్టేందుకు ఇప్పుడు కొత్త జోలను ఎత్తుకున్నారు.
దానిపేరు రెండో ఎస్సార్సీ. అదీ పాతపాటే. ఇప్పుడు దాన్ని లంకించుకోవటంవల్ల ఎస్సార్సీ విచారణ తతంగం పేరిట ఇంకా కొనే్నళ్లు తెలంగాణను మాగవేయవచ్చు. ఎస్సార్సీ పేరు చెప్పి యు.పి.లో మాయావతి నోటా కరక్కాయ వేయవచ్చు. బహుశా ఈ ఎత్తుతోనే కావచ్చు కాంగ్రెసు మాతాపుత్రులు దగ్గరుండి యు.పి. కాంగ్రెసు చేత ఎస్సార్సీ సన్నాయిని నొక్కించారు.
ఈ కొత్తమేళం ఎన్నాళ్లో, తెలంగాణ రైలొచ్చేది ఏ ఏటికో చెప్పిన వారికి చక్కని బహుమతి.

ఆశ్చర్య రాష్ట్రాయణం

-సాక్షి

రావణుడి చితి ఆరితే మండోదరికి వైధవ్యం వస్తుంది. అలా జరగదని (‘ఆశ్చర్య రామాయణం’లో) రాముడు వరమిచ్చాడు. కాబట్టి రావణకాష్ఠం ఎప్పటికీ కాలుతూనే ఉంటుంది-ట!
మన ‘ఆశ్చర్య రాష్ట్రాయణం’లో కాంగ్రెసుదీ కొద్ది తేడాతో అదే పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది లేదంటే తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. ఇస్తామంటే సీమాంధ్రలో అడ్రసు లేకుండా పోతుంది. తెలంగాణను ఇచ్చినా తెలంగాణ వారు కాంగ్రెసును నెత్తినెత్తుకుని ఊరేగరు. కాంగ్రెసు ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణను సాధించిన కీర్తి కె.సి.ఆర్.కీ, ఆయన పార్టీకే దక్కుతుంది. తాము ఎంత వద్దన్నా వినకుండా రాష్ట్రాన్ని చీల్చినందుకు సీమాంధ్ర ఎలాగూ కాంగ్రెసుకు దూరమవుతుంది.
అలాగని తెలంగాణను ఇవ్వము పొమ్మంటే...? తెలంగాణలో కాంగ్రెసుకు పుట్టగతులుండవు. ఉండకపోతే పోనీ - కనీసం సీమాంధ్ర అయినా కొండంత అండగా నిలబడుతుందనుకుందామా? ఆ ఆశా లేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో జగననేవాడు నాన్నగారి పేరు చెప్పుకుంటూ దుమ్ము లేపేస్తూ, కాంగ్రెసు వాళ్లకు పగలే చుక్కలు చూపిస్తున్నాడు. రాష్ట్రంలో యథా స్థితిని కొనసాగించినంత మాత్రాన ఈ పరిస్థితి మారుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ కుర్రవాడు కాంగ్రెసు మీద కత్తి గట్టింది తెలంగాణ అంశం మీద కానే కాదు.
కనుక తెలంగాణను ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెసుకు నష్టమే తప్ప ఒరిగేది లేదు. కరవమంటే కప్పకు కోపం - విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఇస్తామంటే ఆంధ్రావాళ్లకు కోపం; ఇవ్వమంటే తెలంగాణ వాళ్లకు కోపం. ఇవ్వడం లేదని అలిగి ఇటువైపు 13 మంది ఎంపీలు రాజీనామా విసిరికొడితే... ఇచ్చే పక్షంలో అదే పని చేయడానికి అటువైపు 20 మంది ఎంపీలు రడీగా ఉన్నారు. ఎటువైపు బలం తగ్గినా సెంటర్లో కాంగ్రెసు ఓటి సర్కారుకే ఇబ్బంది.
కాబట్టి కనీసం వచ్చే ఎన్నికలదాకా మూడేళ్లపాటైనా కాంగ్రెసు సర్కారు కుదురుగా నిలబడాలంటే ఎటూ మొగ్గకుండా కాలక్షేపం చేయటమే ఉత్తమం. రావణకాష్ఠం ఆరితే మండోదరికి వైధవ్యం వచ్చినట్టు వేర్పాటు కాష్ఠాన్ని ఆర్పితే రాష్ట్రంలో కాంగ్రెసుకు రాజకీయ వైధవ్యం వస్తుంది. కాబట్టి దాన్ని ఆరనీయకుండా, ఏదీ తేల్చకుండా సాధ్యమైనంత కాలం కాంగ్రెసు సర్కారు ఠలాయిస్తూనే ఉంటుంది.
ఈ చిన్న కామన్‌సెన్సు పాయింటే కనుక అర్థమైతే ఇప్పుడు నడుస్తున్న రాజకీయ మాయా నాటకంలో అసలు కిటుకు బోధపడుతుంది. తలకో రకంగా మాట్లాడుతున్నారని, తడవకో విధంగా మాట మార్చేస్తున్నారని, కొంపలంటుకుపోతున్నా కదలక కూచున్నారని కేంద్ర నేతలను ఆడిపోసుకోవటం దండుగ. చెబితే మానం పోతుంది - చెప్పకుంటే ప్రాణం పోతుంది-లాంటి సంకటంలో నేతాశ్రీలు ఇంకోలా మాట్లాడే వీలేలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామోచ్ అని ఈ దేశ హోంమంత్రి పార్లమెంటులో నిలబడి ఆధికారికంగా ప్రకటించిన ఏణ్నర్థం తరవాత తెలంగాణ ఏర్పాటుకు మిగతా ప్రాంతాల, అన్ని పార్టీల అంగీకారం కూడా కావాలని రాజ్యమేలేవారికి గుర్తుకొచ్చింది. తెలంగాణ సంగతి ఏమి చేయాలో చెప్పడానికి శ్రీకృష్ణ కమిటీని వేశాక... సంవత్సరం పాటు ఆలోచించి చించి, అందరినీ సంప్రదించి దించి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు చేతికంది అర్ధ సంవత్సరం గడిచాక... కమిటీ చేసిన ఆరు సూచనల్లో ఏదీ పరిష్కారమార్గం కాదన్న దేవరహస్యం ప్రభువులకు అంతుబట్టింది. ఆరూ పనికిరావు కాబట్టి అసలైన పరిష్కారాన్ని సరికొత్తగా కనిపెట్టవలసిన పని పడింది. ఈ రాష్ట్రానికి ఇన్చార్జి అయిన గులాంనబీ ఆజాద్‌గారు చైనాలో చల్లగా చెప్పినట్టు తెలంగాణ వ్యవహారం సున్న నుంచి మళ్లీ మొదలుపెట్టాలి.
మొదలుపెట్టాక పూర్తి కావటానికి ఎంత కాలమైనా పట్టవచ్చు. ఆరు దారులు చూపించటానికే శ్రీకృష్ణ కమిటీకి సంవత్సరం పడితే, అన్నిటినీ తలదనే్న తిరుగులేని ఒకే ఒక పరిష్కారాన్ని గులాంనబీ గారు చెప్పిన లెవెల్లో కనుక్కోవడానికి ఎన్ని ఏళ్లయినా పట్టవచ్చు. దానికీ ఎలాంటి లక్షణాలుండాలి?! రాష్ట్రంలోని మూడు ప్రాంతాల చేతా భేష్ అనిపించేట్టుగా ఉండాలి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ దాన్ని చూసి భలే భలే అనాలి. 294 మంది సభ్యులుగల అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో దానికి వల్లె అనాలి. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా అది ఏకగ్రీవం కాజాలదు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తేగానీ సర్కారువారు తెలంగాణను శాంక్షను చెయ్యరు.
అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిమీద నిలిచి, ఏకగ్రీవంగా పాస్ చెయ్యటానికి ఇదేమన్నా ఎంపీలూ, ఎమ్మెల్యేల జీతాలను అయినకాడికి పెంచుకునే తీర్మానమా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన ఏణ్నర్థం తరవాత కూడా కేంద్రాన్ని నడిపించే కాంగ్రెస్ పార్టీయే దానిమీద ఎటూ తేల్చలేదు. అసలైన ఒక పార్టీలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు మిగతా అన్ని పార్టీలూ ఒక్క తాటిమీదికి వచ్చి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చెయ్యటం కలియుగాంతంలోగా అయ్యేపనేనా? అయినా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని విడగొట్టి, వేరే రాష్ట్రంగా ఏర్పాటుచేయడానికి ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ, పార్టీలన్నీ ఒప్పుకోవాలనీ, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి తీరాలనీ రాజ్యాంగంలో ఎక్కడుంది?
లేదు. అయినా కేంద్ర ప్రభువులు అలాంటి కండిషన్లు నడమంత్రంగా పెడుతున్నారంటే... అవన్నీ నెరవేరితేగానీ వ్యవహారం అంగుళం కూడా ముందుకు కదలదని రాష్ట్ర కాంగ్రెసు ఇన్చార్జే అన్నాడంటే తెలంగాణ ఏర్పాటు ఇప్పట్లో అంగుళం ముందుకు జరగదనే భావించాలి. సెకండురవుండులో తెలంగాణ డిమాండు సున్నా దగ్గర ఆగిపోతుంది లెమ్మనే సీమాంధ్రులు సంతోషించాలి. సంతోషించి కాంగ్రెసు పార్టీనే ఎప్పటివలె బలపరుస్తూ పోవాలి. ఇంకో చెంప తెలంగాణవాళ్లు తెలంగాణపై ప్రకటన త్వరలో విడుదల అని ఇంకో ఎఐసిసి పెద్దాయన పొక్కించిన వార్తనే పటంకట్టించి, అది నిజమయ్యే రోజు కోసమే ఎదురుచూస్తూ కూచోవాలి. అది నిజమయ్యేదాకా కాంగ్రెసునే పల్లకీ ఎక్కించి ఊరేగిస్తుండాలి. భలే వ్యూహం!
రాజీనామాలిస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందనో, ఇలా రాజీనామాలందగానే సోనియమ్మ అలా తెలంగాణను ఇచ్చేస్తుందనో వారూ వీరూ చెప్పిన కబుర్లను నమ్మి ఎరక్కపోయ ఇరుకున్న టి-కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల సంకటం నుంచి ఒళ్లు చెడకుండా, పరువుగా ఎలా బయటపడతారన్నదే రాజకీయ రంగస్థలం మీద తరువాయ అంకంలో చూడబోయే తమాషా.

మిగిలేదెవరు?!

November 19th, 2011

ఛఛ! ఇదేం బాగో లేదు! వారి మీద కేసులు, వీరికి రిమాండ్లు భలే బాగున్నాయని అందరూ పళ్లికిలిస్తున్నారే తప్ప అరవై ఏళ్లుగా మన మహానేతలు కడు జాగ్రత్తగా కలిసికట్టుగా కాపాడుకొస్తున్న ఎంచక్కని ఏర్పాటుకు ముంచుకొస్తున్న ముప్పును ఎవరూ గ్రహించటమే లేదు!
పేరు మోసిన మన పార్టీల మధ్య, వాటిని నడిపే నేతల మధ్య పైకి చెప్పుకోని, చెప్పుకోకూడని పెద్ద మనుషుల ఒప్పందం చాలా ఏళ్లుగా ఉంది. ఒకసారి గెలిచి తాము పవర్లోకి వస్తే జనానికి రోతపుట్టి మళ్లీ ఎన్నికల్లో తమను తన్ని తగలెయ్యటం ఖాయం. (పూర్తికాలం అధికారం చలాయంచీ మళ్లీ గద్దెనెక్కగలిగింది ఇటీవలి రాజశేఖరరెడ్డి ఒక్కడే) తమ మీద అసహ్యంతో ఎగస్పార్టీని నెత్తిన పెట్టుకున్నా, తప్పుడు పనుల్లో వాళ్లూ తమకు తోడు బోయిన వారే కనుక, మళ్లీ వచ్చే ఎన్నికల్లో వారినీ గెంటేయటం దాదాపు గ్యారంటీ! వాళ్లకు శాస్తి చెయ్యాలంటే ఇష్టమున్నా లేకున్నా మళ్లీ తమనే పిలిచి పల్లకి ఎక్కించటం మినహా వెర్రిజనానికి వేరే దారి ఉండదు. కాబట్టి గద్దెమీద ఉన్నప్పుడు అడ్డగోలుగా నొక్కేసినదాన్ని అపోజిషన్లో ఉన్న ఐదేళ్లూ దర్జాగా ఎంజాయ్ చేస్తే తరువాయి ఎన్నికల్లో వద్దన్నా పవరు తమ కాళ్లదగ్గరికి నడిచొస్తుంది.
ఈ అధర్మ సూక్ష్మం అన్ని పార్టీలకీ అర్థమైంది. తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు అపోజిషను వాళ్ల పాత పాపాలను కెలక్కుండా ఉంటే వాళ్ల ‘వంతు’ వచ్చినప్పుడు వాళ్లూ తమను తిప్పలు పెట్టకుండా ఉంటారు. అందుకే - ‘తిను-తిననివ్వు; బతుకు-బతకనివ్వు’ అన్న పాలిసీతో అన్ని పార్టీల అందరు లీడర్లూ పైకి మాత్రం కలహించుకుంటూ, అవసరమైనప్పుడు సహకరించుకుంటూ జనాల చెవిలో పూలు పెడుతూ వచ్చారు. అధికార పార్టీ వాళ్లు అక్కడ ఇంత తిన్నారు, ఇందులో ఇంత బొక్కారు; మాకే కనుక అధికారం వస్తే వాళ్లు తిన్నది మొత్తం కక్కిస్తాం... జైల్లో కుక్కేస్తాం... విచారణలు జరిపించి, పాపాల చిట్టా విప్పిస్తాం... అని రంకెలేసే విపక్ష మేళం వాళ్లకు పవరు చేతికొచ్చాక ఆ ఊసే గుర్తుండదు. కాంగ్రెసు పోయి ‘దేశం’ వచ్చినా, ‘దేశం’ పోయి కాంగ్రెసు వచ్చినా ఏ పార్టీ వాడి ఏ అక్రమ ఆస్తీ చెక్కు చెదరదు. పట్టుకుంటారేమోనన్న భయమూ ఎవరికీ ఉండదు.
ఇంతకాలమూ బహు చక్కగా, అందరికీ వాటంగా నడుస్తున్న ఈ భలే మంచి ఏర్పాటు కాస్తా ఇప్పుడు భళ్లున బద్దలైంది. ఏ పార్టీ ప్రభువూ తనకు తానై మాజీ పాలకుల, వారి ఇలాకావాళ్ల అక్రమ ఆర్జనల జోలికి పోకుండా ఎంత గొప్ప సంయమం చూపితేనేమి? పనిలేని కోర్టులు తీరికూర్చుని మారాజుల బంగారు పుట్టలో వేలు పెట్టటంతో అంతులేని కథ కాస్తా అడ్డం తిరిగింది. పరిపాలకుల పెంపుడు జంతువులా బుద్ధిగా ఒదిగి ఉండి, వారు కరవమన్న వారిని మాత్రమే కరవమన్న మేరకే కరుస్తూ, నమ్మినబంటులా సేవ చేసిన సిబిఐకి కూడా కోర్టుల చేతిలో పడ్డాక కోరలొచ్చాయి. కొమ్ములూ మొలిచాయి. వాటితో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వారిని కుమ్ముతూ... విచారణలు, అరెస్టులు అంటూ కుళ్లబొడిచేస్తున్నది. మరీ ఇంత ఓఘాయిత్యమైతే మన రాజకీయ మణిమాణిక్యాలు ఇక ఎవరితో మొరపెట్టుకోవాలి?!
కృష్ణపక్షంలో చంద్రుడికాంతి అంతకంతకూ క్షీణించి అంతరించినట్టు, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సర్కారు ప్రకాశం సన్నగిల్లుతుంది. అపోజిషను మీద మోజు నానాటికీ పెరుగుతుంది. ఎన్నికల అమావాశ్య నాటికి పాలకపక్షం పరువు నేలమట్టమైతే అపోజిషను కళ అదే దామాషాలో పెరగుతూపోయి, పాత ప్రత్యామ్నాయాన్ని దుమ్ము దులిపి మళ్లీ కళ్లకద్దుకోవటం ఓటరయ్యలకు సులువవుతుంది.
కాని - ఇప్పుడో? రూలింగు పార్టీ షరామామూలుగా డీలాపడింది. పాత పహిల్వాన్‌కు తోడు కొత్త వస్తాదు గోదాలోకి దిగటంతో అపోజిషను సీను మారింది. బిగ్ ఫైటు అంతా బాబు, జగన్‌ల మధ్యే హోరాహోరీగా నడుస్తోంది. ‘పవర’మాల చివరికి వీరిలో ఎవరి మెళ్లో పడవచ్చునని జనాలు తర్కిస్తున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఇద్దరి నెత్తినా సిబిఐ కేసుల బండలు పడ్డాయి. తన బద్ధ శత్రువైన కాంగ్రెసు జగన్ మీద పెట్టించిన కేసుకు టి.డి.పి. పక్క తాళం వేస్తే.. తమరు మాత్రం తక్కువ తిన్నారా బాబూ అని జగనమ్మ కోర్టుకెక్కి బాబు ఆస్తుల మీద సిబిఐ దర్యాప్తు వేయించింది. మళ్లీ ఎన్నికల్లో అధికార దండం అందుకోవాలనుకుంటున్న ఇద్దరు నేతాశ్రీలూ అవినీతి ఆరోపణల ఊబిలో ఇరుక్కుని, కాంగ్రెసుకు దీటుగా కుదేలైతే ఇక జనం ఎవరికి ఓటెయ్యాలి? అధికారం మార్పిడి ఎలా జరుగుతుంది? సిబిఐ వాళ్లొచ్చి ఆటంతా మార్చేస్తే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షం మీద కొరడా ఝళిపిస్తే పవిత్ర ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ఇదీ సమస్య.
ఎప్పుడో రెండేళ్ల తరవాత వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం మాట దేవుడెరుగు. ముందు మన ధర్మ ప్రభుత్వం నడిచేదెలా? ‘‘ఊబ నా మగడు ఉండీ ఒకటే లేకా ఒకటే’’ అన్నట్టు మంత్రిశ్రీలు కొలువులో ఉన్నా ఒకటే. లేకున్నా ఒకటే. ఆ సంగతి మొన్న తెలంగాణ ‘సకలం’లోనే అందరికీ తెలిసి వచ్చింది. మంత్రులు లేకుంటే పోయేగానీ సర్కారు రథాన్ని నడపటానికి పై ఎత్తున అధికారులైతే కావాలి కదా? జమానా మారినా తమ జోలికి ఎవరు రారు అన్నది అనుభవంలో రూఢి కావటంతో అధికార గణానికి పట్టపగ్గాలు లేవు. వారిది ఆలిండియా సర్వీసు కనుక తప్పుడు పనులు చేసేది లేదని కరాఖండిగా తిరస్కరించినా రాజకీయ నాయకులు చేయగలిగింది పెద్దగా ఉండదు. అయినా ఆ సోయి బతకనేర్చిన అధికార్లకు ఉండదు. స్వామిని మించిన స్వామి భక్తితో పాలకపక్షానికి తాబేదారులా తమను తాము దిగజార్జుకుని, ముఖ్యమంత్రి మెహర్బానీకి అంగలార్చి, కనుసైగ చేస్తే చాలు ఎలాంటి తప్పుడు పనినైనా చేసి, రూల్సు నడ్డి విరిచి ‘పై’వాళ్లను ఖుషీ చేసి, అత్తసొత్తును అల్లుడు దానం చేసినట్టు గనాఘనులకు లీజులు, పర్మిషన్లు అడ్డగోలుగా కట్టబెట్టిన ఆఫీసరు రత్నాలకు ఇప్పుడు మూడింది.
ఒక్క గాలి కేసుకే ఇంత గోలైంది. ఇప్పటికే ఇద్దరు ఐ.ఎ.ఎస్. పెద్ద్ఫాసర్లు జైలుదారిలో ఉన్నారు. ఇక జగన్ ఆస్తుల తబిసేళ్లలోనూ ఉచ్చు బిగిసి, పనిలో పనిగా అనేక ఆరోపణలలో ఆరియు తేరిన బాబు మీదా సిబిఐ కోర్టు పురమాయింపుపై కేసుల బండలు పడి... తొమ్మిదేళ్ల ‘సైకిల్’ రాజ్యంలో బాబు అడుగులకు మడుగులెత్తిన బాబుశ్రీల మీదా కేసుల నోళ్లు తెరచుకుంటే ఎన్ని డజన్ల అధికారుల మీద, మంత్రుల మీద కేసులు పెట్టాలి? ఈ తీగలతో కేసుల డొంకలు ఒకటొకటిగా కదులుతూ పోతే, పట్టువదలని శంకరరావు మంత్రిగా ఉండీ సాటి మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించి ఇలాగే ముందుకు పోతే ప్రభుత్వంలో మిగిలేదెందరు? జైలు విడిదిలో సెటిలయ్యేదెందరు? ఎక్కువమంది జైల్లో ఉంటే సర్కారు ఎలా నడుస్తుంది. ఈ వరస ఇలాగే కొనసాగి అధికారులు, మంత్రులు సచివాలయానికి రాలేకపోతే సచివాలయం బ్రాంచి ఆఫీసును వారున్న చోటే పెడితే బాగుంటుందేమో?

జంతర్‌మంతర్

---సాక్షి

కుక్క పని కుక్క చెయ్యాలి. గాడిద పని గాడిద చెయ్యాలి. ఇది పంచతంత్రం నీతి. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ తంత్రం దీనికి సరిగ్గా రివర్సు!
మామూలుగా సర్కారీ పక్షం సర్కారు కొమ్ము గాస్తుంది. విపక్షమేమో సందు దొరికితే చాలు సర్కారును పడగొట్టాలని కాచుకుని ఉంటుంది. చిత్రవిచిత్ర ఆంధ్రా రాజకీయం లోనో?! విపక్షం కూలీ లేకుండా గవర్నమెంటుకు కావలి కాస్తుంది. పడగొట్టేందుకు లక్కీచాన్సు నడుచుకుంటూ కాళ్ల దగ్గరికి వచ్చినా కళ్లు మూసేసుకుని, చేతులు కట్టేసుకుని, ఓటి సర్కారుకు ఢోకా లేకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది.
సాధారణంగా అధికార పక్షంలో చిన్నపాటి తిరుగుబాటు లేస్తేనే... మెజారిటీకి ముప్పులేదని తెలిసినప్పటికీ... ప్రతిపక్షం రెచ్చిపోతుంది. వెంటనే అసెంబ్లీని పిలిచి విశ్వాస పరీక్ష పెట్టాలని గవర్నరుకు డిమాండు మీద డిమాండు చేస్తుంది. నెగ్గే ఆశ ఏకోశానా లేదని తెలిసినా, అవిశ్వాస తీర్మానం పెట్టి గవర్నమెంటును దెబ్బతీయటానికి ఉవ్విళ్లూరుతుంది. అలాంటిది - నిజంగా పెద్ద తిరుగుబాట్లే లేచి గవర్నమెంటు మనుగడే గండంలో పడితే...? విశ్వాసమో అవిశ్వాసమో తరుముకొచ్చి పరీక్ష పెడితే గవర్నమెంటు గట్టెక్కటం అనుమానమేనని కళ్లముందు కనపడుతూంటే...? ఎగిరి గంతేసి, ప్రభుత్వం దుంప తెంచకుండా ఏ ప్రతిపక్షమైనా ఊరకుంటుందా?
ఉంటుంది! జంతర్ మంతర్ ఆంధ్రా పాలిటిక్సులో! నారా నాయుడిగారి లోకోత్తర నిర్వాహకంలో!!
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లు 294. అందులో ఒకటి ఖాళీ. కనీసం 147 మంది వద్దు పొమ్మంటే చాలు కాంగ్రెసు సర్కారు కుప్పకూలుతుంది. ఒక్క తెలుగుదేశానికే 90 మంది ఎమ్మెల్యేలున్నారు. (వారిలో ముగ్గురు తిరగబడినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ జమానాకు పల్లకి మోయరు.) తెరాస, బిజెపి, కమ్యూనిస్టులు, అమాంబాపతులను కలిపితే 21. కాంగ్రెస్, ప్రజారాజ్యాల నుంచి ఇప్పటికే 27గురు జగన్‌కు జైకొట్టి కాంగ్రెస్ మీద కత్తి కట్టారు. ఈ మధ్యే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస వైపు దూకారు. 90+21+27+3=141. సర్కారును కూల్చేందుకు కావలసిన ‘మాజిక్ ఫిగర్’ 147కి ఇది అరడజను మాత్రమే తక్కువ. తెలంగాణ సెంటిమెంటు, కాంగ్రెసులో లుకలుకలు ఇప్పుడున్న స్థితిలో వ్యవహారం అంతదాకా వస్తే కిరణ్ సర్కారును సాగనంపడానికి ఆరుగురిని కూడగట్టటం మంచినీళ్ల ప్రాయం. ఏదైనా... ప్రధాన ప్రతిపక్షమైన ‘సైకిలు’వారు సై అన్నప్పుడు మాత్రమే సాధ్యం. అంటే... కాంగ్రెసు సర్కారును ఉంచటమా, ఊడగొట్టటమా అనేది తెలుగుదేశాధీశుడి చేతుల్లోనే ఉంది. నాయుడుగారు నిజంగా కాంగ్రెసుకు పగవాడే అయితే శత్రువును కూల్చటానికి ఇంతకు మించిన సమయం దొరకదు.
కాని చిత్రం! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దొరతనం ప్రాణం చంద్రబాబు చేతుల్లో ఉన్నా ఆయన కాంగ్రెసు చిలకను గుటుక్కుమనిపించకపోగా అల్లారుముద్దుగా కాపాడుతున్నాడు! గవర్నమెంటు ఎప్పుడు చిక్కుల్లో పడ్డా ఆపద్బాంధవుడిలా చక్రం అడ్డు వేస్తూ... అక్కర వచ్చినప్పుడు లోపాయకారీగా ఆదుకుంటూ... అధికార పార్టీలో ఎందరు ఎదురుతిరిగినా చూడనట్టే నటిస్తూ... పడగొడదాం రావయ్యా మగడా అని వేరేవాళ్లు పిలిచినా మాకేమి పట్టిందని వాదులాడుతూ... అవిశ్వాసాన్ని మీరు దంచండి; నేను పక్కలెగరేస్తానని తప్పించుకుంటూ అతి తెలివిగా కాపుకాసే నాయుడే ఇవాళ కాంగ్రెసు సర్కారుకు అసలైన ఇన్సూరెన్సు!
పాపం ఆయన మాత్రం ఏమిచేయగలడు? పీత కష్టాలు పీతవన్నట్టు బాబు కష్టాలు బాబువి. గవర్నమెంటును పడగొట్టగానే సంబరం కాదు. ఆ తరవాత ఎన్నికలొస్తే అటు తెలంగాణలో ఉప్పుపుట్టక, ఇటు సీమాంధ్రలో పరువు దక్కక, ఇటీవలి రివాజు ప్రకారం డిపాజిట్లు గల్లంతయితే తెదేపాకు ఏదీగతి? అందుకే ఎన్నికల సుడిగుండంలో మొత్తం మునిగే కన్నా, కాంగ్రెసుకు కర్ర పోలీసుగా బతుకు వెళ్లదియ్యటమే తెలుగు చాణక్యుడి దృష్టిలో తెలివైన పని!
కారణాలు ఏమైతేనేమి- ప్రధాన ప్రతిపక్షమే కొండంత అండగా నిలబడినప్పుడు కాంగ్రెసు హిప్పొపొటామసును ఏ తిరుగుబాటు బండా ఏమీ చెయ్యలేదు. బాగుంది. ప్రతిపక్షం పోయి పాలక పక్షం కొమ్ము కాస్తే మరి ప్రతిపక్షం పని ఎవరు చెయ్యాలి? ఎవరూ చెయ్యకపోతే ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ఆ సంగతి ప్రజాస్వామ్యాన్ని కాచివడబోసిన కాంగ్రెసు వాళ్లకు ఒకరు చెప్పక్కర్లేదు. అందుకే ఒక చెంప ప్రభుత్వంలో భాగంగా ఉంటూనే ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రతిపక్షం పాత్రనూ శ్రమ అనుకోకుండా వాళ్లే పోషిస్తూ ఏకకాలంలో ఎంచక్కా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
మా ప్రభుత్వంలో ఫలానా మంత్రులు అవినీతిపరులని ఇంకో మంత్రి గవర్నరుకు ఫిర్యాదుచేసి, పనిలో పనిగా లోకాయుక్తకూ చెవిన వేస్తాడు. మా ప్రభుత్వం ప్రకటించిన ఫలానా పథకం శుద్ధ దండుగని ఒక సీనియర్ మంత్రి మెటికలు విరిస్తే, మా ప్రభుత్వంలో ఫలానా విభాగాలు వేస్ట్ అని స్వయానా ఆ విభాగాలను చూసే ఇంకో మంత్రి మహోదయుడు లోకానికి చాటుతాడు. మంత్రికీ మంత్రికీ పడదు. ముఖ్యమంత్రిని మంత్రులు గుర్తించరు. మంత్రులను ఎమ్మెల్యేలు గుర్తించరు. అధికారుల మీద మంత్రులు, మంత్రుల మీద అధికారులు, వారిద్దరి మీద ఎమ్మెల్యేలు దుమ్మెత్తి పోస్తారు. ఆ రకంగా పాలక ప్రముఖులందరూ తలా ఒక చెయ్యి వేసి దీటైన ప్రతిపక్షం లేని లోటును బ్రహ్మాండంగా భర్తీ చేస్తున్నారు.
అంతేకాదు. ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో తెలియదు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందుతాడో అర్థం కాదు. ఎవరు ఎమ్మెల్యేనో, ఎవరు కాదో అంతకన్నా అంతుబట్టదు. అసెంబ్లీ రికార్డుల్లో ఒకటుంటే బయట రాజకీయంలో వేరొకలా కనపడుతుంది. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ నేత ఆమోదించరు. శాసనసభ్యత్వాలను త్యాగం చేస్తే సభాపతి ఒప్పుకోరు. ఎమ్మెల్యేలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు పార్టీలు మార్చినా పార్టీల నాయకత్వాలు పట్టించుకోవు. రాష్ట్రంలో ప్రభుత్వంలాగే ఫిరాయింపుల నిరోధక శాసనం కూడా ఉండీ లేనట్టే! చట్టాలు, కట్టుబాట్లు ఇక్కడ చెల్లవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయమే ఒక పెద్ద అబ్రకదబ్ర!

ఇదయ్యా మీడియా!

-సాక్షి

పెట్టుబడికి కట్టుకథకు
పుట్టిన విషపుత్రిక
-అంటూ సంసారపక్షపు నడిపాత ఆంధ్రపత్రికనే చడామడా దులిపాడు శ్రీశ్రీ! కూడబలుక్కున్నట్టు చెలరేగి తెలుగు జనానికి పిచ్చెత్తేలా బుద్ధి శుద్ధి చేస్తున్న గొప్ప పత్రికల దూకుడును ఈ కాలంలో చూసి ఉంటే మైకం ఠక్కున దిగి మహాకవి ఏమి చేసేవాడో! ఏమి రాసేవాడో!!
ప్రపంచం ఎంతో ముందుకు పోయినా, జర్నలిజం గురించి మన అవగాహన మాత్రం తాతలకాలం దగ్గరే ఆగిపోయింది. ఇది చాలా బోలెడు ఘోరం. కాకి బంగారపు దీపాల్లా ధగధగ వెలుగుతున్న రాజా పత్రికలను చూసైనా నిక్కమైన పత్రికా రచన అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోవటం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం.
ఉదాహరణకు - ప్రజలకు దారి చూపాల్సిన పత్రికను నడిపే వాడికి కొంచెం నీతి, కాస్త నిజాయతి, రవంత వృత్తి నిబద్ధత, ఆవగింజలో వెయ్యోవంతు నిష్పాక్షికత, సత్యసంధత ఉంటాయని, ఉండాలని మనం చాదస్తంగా అనుకుంటున్నాం.
తప్పు! పత్రికను నడిపించేవాడికి కనీసం కిరోసిన్‌ను స్మగ్లింగ్ చేసిన లోకోత్తర పూర్వానుభవమైనా ఉండి ఉండాలి. వెధవది కిరసనాయిలునే సరిహద్దు దాటించి వేరే రాష్ట్రానికి చేరవేయలేనివాడు ప్రజాప్రయోజనాలను సమస్యలు దాటించి సురక్షిత గమ్యానికి ఎలా చేరవేయగలడు?
అలాగే - పాచినోటితో లోకానికి నీతులు ఉపదేశించే పత్రికాధిపతికి కనీసం ఒక పొలిటికల్ పార్టీలో పాలేరుగా పనిచేసి, ఓ మహానేతాశ్రీ పనుపున డబ్బు మూటలు బట్వాడా చేసిన పావన చరిత్ర ఉంటే మంచిది. మొన్నటిదాకా పూటకు ఠికానాలేని వాడివి ఏకంగా పెద్ద పత్రికనే ఎలా కొట్టెయ్యగలిగావంటే గాండ్రించి, డబాయించి, మీదపడి కరిచి నోళ్లు మూయించగల సత్తా ఉండటం బెటరు. తనకు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నడమంత్రపు సిరితో కంపరం పుట్టేలా మిడిసిపడి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతటి వాళ్లన్నయినా గడ్డిపరకల్లా తీసిపారేసి, లక్షలమందికి ఆరాధ్యులైన వారి మీద కూడా గిట్టనివారి పురమాయింపుపై అభాండాల బండలు రువ్వగలిగిన గొప్ప సంస్కారం ఎంత ఉంటే అంత మేలు.
అదే మాదిరిగా - పత్రికారంగాన్ని ఉద్ధరించేందుకే భూమి మీద అవతారమెత్తిన మహానుభావుడికి కనీసం తనది కాని భూమిని దర్జాగా కబ్జా చేసి, రామప్పంతులులా కేసులు బనాయించి, అసలు హక్కుదారులను బతికినంతకాలం ఏడిపించి, ఉసురు పోసుకోగలిగినంత మంచితనమైనా కంపల్సరీ! ఎన్నివేల ఎకరాలను ఎంత అప్పనంగా కాజేస్తే, ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని నిబంధనల నడ్డి విరగ్గొట్టి ఎన్ని అక్రమాలకు పాల్పడితే... ఊసరవెల్లికి సిగ్గొచ్చేలా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులు మారిస్తే అంత పేరు! అంత పొగరు!!
గోబెల్స్, గోబెల్స్ అని అందరూ తెగ అంటారు కాని గోబెల్స్ గాడిది ఏమి గొప్ప? ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని కనిపెట్టటమే కదా అతగాడు ఊడబొడిచిందల్లా?! అదే మన పుణ్యఫలం కొద్దీ మన పాలబడ్డ పత్రికారాజాలను చూడండి. నిజాన్ని తిరగవేసి అబద్ధంగా, అబద్ధాన్ని మరగవేసి నికార్సయిన నిజంగా చూపించి... గోరంతను కొండంతగా, కొండంతను గోరంతగా అవసరాన్నిబట్టి, ఆయా వ్యక్తులనుబట్టి, వారి మీద తమ ఇష్టానిష్టాలనుబట్టి, కులదైవాల ప్రయోజనాలనుబట్టి, పక్కా వ్యాపార స్వార్థాలనుబట్టి ఎలా తారుమారుగా తిమ్మినిబమ్మి చేసెయ్య వచ్చో తెలుగు పత్రికా మణిదీపాలను చూసే ఎవరైనా నేర్చుకోవాలి!
మాటవరసకు - ఉషోదయంతో అసత్యం నినదించుగాక అని శపథం పట్టిన నీతుల మారి పెద్ద పత్రిక ఒకానొక గాలిరెడ్డి అవినీతి గనుల్ని కూలీ అడక్కుండా కష్టపడి, కళ్లు తిరిగేలా తవ్విపోసింది. ఫలానా గనుల్లో ఎన్ని వేల కోట్లు గోల్‌మాల్ అయిందీ కచ్చితంగా కాకుల లెక్క గట్టి వెరిజనాన్ని ఔరా అనిపించింది. నాలుగు రోజుల తరవాత మళ్లీ అదే నోటితో, అంతే నేర్పుతో... సదరు గనుల ఖనిజం బహు నాసిరకమని, దాని పేరు చెప్పుకుని వేరే రాష్ట్రంలో ఇంకెక్కడో తవ్వకాలు జరిగాయనీ కొత్త కథను అల్లింది. ఔను మరి! ఎప్పుడూ ఒకే కథ అయితే చదివేవాళ్లకు బోరు కదా?!
జగన్ అనే పరమపాపికి ఫలానా అధికారులు నోటీసు ఇచ్చారని సంబరంగా రాసే పత్రిక... అదే పరిస్థితి తమ అభిమాన నాయకుడికి ఎదురైతే ‘‘ఏదో లేఖ రాసారంతే’’ అని తక్కువ చేసేస్తుంది.
పుణ్యాత్ముడు బాబు మీద తస్మదీయుల కేసు అయితేనేమో ‘‘వై.ఎస్. విజయ పిటీషన్ విచారణకు స్వీకరణ’’ అని చప్పగా చెప్పే మేటి పత్రిక అదే తాము పగబట్టిన పాపాత్ముడిపై అస్మదీయుల కేసులో అలాంటి నిర్ణయమే వస్తే ‘‘సిబిఐ బోనులో జగన్’’ అని ఉత్సాహంగా ఉరకలేస్తుంది. తాము పగబట్టిన వాడికి ఎమ్మెల్యేలు జై కొట్టినా, మిడిమేలపు మీడియాకు అది చీకొట్టినట్టే వినపడుతుంది.
పాపిష్టి విరోధి ఢిల్లీకి వెళితే అక్కడి పెద్దల కాళ్లావేళ్లా పడి దేబిరించినట్టు!
మహారాజశ్రీ బాబుగారు అలాంటి టూరే చేస్తేనేమో జాతీయ నాయకులతో భేటీ వేసినట్టు!
మన వాళ్ల మీద దృష్టి పెడితే అది ‘కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’!
అదే మన పగవాళ్లమీద కన్ను వేస్తేనేమో అది నిప్పులాంటి నిష్ఠాగరిష్ఠ దర్యాప్తు సంస్థ. ఇలా ప్లేటు మారుస్తారేమిటంటే - హైకోర్టు ఆర్డరు ప్రకారం దర్యాపు కాబట్టి వంకలేదని వింత వివరణ! ‘తమరు కళ్లకద్దుకుంటున్న ఆర్డరును ప్రసాదించిన వారికి వేరేదో పెద్ద కుర్చీ దక్కిందట కదా’ అని మనం అడగాకూడదు. వారు విననూ కూడదు!
సిబిఐ కచేరీ తమ సొంత టీవీ స్టూడియో అయినట్టు, సర్కారీ పత్తేదారులు తమ కొలువులోని యాంకర్లు అయినట్టు, అక్కడ ఎవరిని ఏమి అడిగేదీ, ఎవరు ఏమి చెప్పేదీ, తరవాత ఏమి జరగబోయేదీ కెమెరాలు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నట్టు అమాయక జనానికి చెవిలో పూలు పెట్టటం తెలుగు మీడియా మోతుబరుల ప్రత్యేకత! ముఖ్యమంత్రి మహాశయుడు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే నిరసన నినాదాలను జయజయ ధ్వానాలుగా చిత్రించి... ప్రతిపక్ష మహానాయకుడితో భుజం కలిపి ఏలినవారి పల్లకి మోసి తరించే మీడియాను వీక్షించటం మన పూర్వజన్మ సుకృతం. శత్రువును పాతరెయ్యటం కోసం ఎంతకైనా బరితెగించి, ఎన్ని నిలువుల లోతైనా నిజాన్ని పాతిపెట్టగలగటమే ఈ కాలపు పత్రికా ధర్మం!!

Monday, November 28, 2011

ఎన్‌కౌంటరా..పెన్‌కౌంటరా..?

ఎన్‌కౌంటరా..పెన్‌కౌంటరా..?

జర్నలిస్టు కాల్‌తో కిషన్‌జీ ఉనికి గుర్తింపు? పార్టీ ద్రోహులపైనా అనుమానం


సదానంద్ బెంబ్రే 
(ఆంధ్రభూమి బ్యూరో) 

 కరీంనగర్, నవంబర్ 26: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీది నిజంగా ఎన్‌కౌంటరేనా? లేకపోతే కిషన్‌జీకి ఉన్న మీడియా బలహీనతను సానుకూలంగా మలచుకొన్న పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రాప్ చేయడం ద్వారా పట్టుకొని కాల్చి చంపారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సంఘటన జరిగిన తీరుతెన్నులు, కేంద్ర కమిటి స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న నాయకుడికి ఉండాల్సిన రక్షణ లేకపోవడం, కేవలం నలుగురు వ్యక్తులే సంఘటనా స్థలంలో ఉన్నట్లు పోలీసులు చెబుతుండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పార్టీలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన నేతల మధ్య ఇటీవలి కాలంలో బేధాభిప్రాయాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ వెనుక పార్టీకి చెందిన ద్రోహుల పాత్ర ఏమైనా ఉందా? అన్న అనుమానాలూ లేకపోలేదు. పీపుల్స్‌వార్ ఆవిర్భావం నుంచి రెడ్‌కార్‌డార్ నిర్మాణం వరకు పార్టీలో కీలక పాత్ర పోషించిన కిషన్‌జీ మొదటి నుంచి పార్టీలో కొంతమందికి కొరకరాని కొయ్యగానే ఉన్నట్లు ప్రచారంలో ఉంది. తాజా పరిణామాల్లో గణపతి అనారోగ్యరీత్యా బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్న ఊహాగానాలు బలంగా విన్పిస్తున్నాయి. గణపతి తరువాత ఎవరు పగ్గాలు చేపట్టాలన్న అంశంపై మావోయిస్టు పార్టీ గత రెండేళ్లుగా విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో గణపతి కన్నా సీనియరైన కిషన్‌జీకే పగ్గాలు అప్పగించవచ్చని వార్తలు వెలువడుతున్న తరుణంలో పూర్వ ఎంసిసి అగ్రనాయకుడైన కిషోర్‌జీ అలియాస్ కిషన్‌దా కూడా మావోయిస్టు పార్టీ సుప్రీమ్ రేసులో ఉన్నారు. ఆయనేకాకుండా మన రాష్ట్రానికే చెందిన నంబాల కేశవరావు కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఉత్తరాది నేతలకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు మధ్య నాయకత్వం విషయంలో తీవ్రమైన అగాథం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా పోలీసులు చేస్తున్న ప్రచారమేనని గతంలో అనేక సందర్భాల్లో కిషన్‌జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొట్టిపారేశారు. అయితే ఇటీవలి కాలంలో లొంగిపోయిన ఛత్తీస్‌గడ్, ఎఒబి ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు పార్టీలో నెలకొన్న విభేదాలను పరోక్షంగా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిషన్‌జీ ఎన్‌కౌంటర్ చర్చనీయాంశమైంది. జార్ఖండ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో 21 సంవత్సరాలుగా పార్టీని ముందుకు నడిపించిన కిషన్‌జీకి మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు కల్పించే రక్షణను ఎందుకు కల్పించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా పార్టీలో కీలక స్థానంలో ఉన్న అగ్రనేతలకు బయట ప్రజాప్రతినిధులకు కల్పించే జడ్ ఫ్లస్ కేటగిరీ రక్షణ తరహాలో 40 మందికి తగ్గకుండా సాయుధుల రక్షణ ఏర్పాటు చేయాలి. కానీ కిషన్‌జీ ఎన్‌కౌంటర్ సంఘటనలో కేవలం నలుగురు మాత్రమే ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే కిషన్‌జీ బుధవారం మిడ్నాపూర్‌కు చెందిన ఓ పాత్రికేయుడితో జరిపిన టెలీఫోన్ సంభాషణే పోలీసులకు ఆయన ఉనికిని పట్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. కిషన్‌జీ మొదటి నుంచీ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియానే బలమైన సాధనంగా నమ్మేవాడని తెలుస్తోంది. ఈ కారణంగానే కిషన్‌జీ మీడియా ప్రతినిధులతో సన్నిహితంగా మెలిగేవాడని చెబుతున్నారు. ఈక్రమంలో ఆయన బలహీనతను పసిగట్టి పోలీస్ వర్గాలతో సన్నిహితంగా ఉండే జర్నలిస్టులను ఆయనతో సంభాషణలకు ఉపయోగించుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సరిగ్గా ఇదే తరహాలో అనేక ఎన్‌కౌంటర్లు జరిగినట్లు ఆరోపణలు రావడం ఈ సందర్భంగా గమనార్హం. 2004 శాంతి చర్చల తరువాత మావోయిస్టు అగ్రనేతలు మీడియాతో జరిపిన సంభాషణలే వారి ఉనికిని ఇంటిలిజెన్స్‌కు పట్టించాయి. దాంతో కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్ సహా అనేకమంది అగ్రనేతలు, జిల్లా కార్యదర్శులు, దళాలను పోలీసులు మట్టుబెట్టగలిగారు. కిషన్‌జీ విషయంలోనూ పోలీసులు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించినట్లు బెంగాల్‌కు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక సీనియర్ జర్నలిస్టు ధ్రువీకరించడం ఎంతైనా ప్రస్తావనార్హం. లాల్‌గఢ్ సంఘటన జరిగిన సందర్భంలోనూ కిషన్‌జీ ఆచూకీని పోలీసులు ఇదే తరహాలో పసిగట్టి చుట్టుముట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

తుపాకీ నీడలో అశ్రునివాళి

 

పోలీసు కనుసన్నల్లో కిషన్‌జీ అంతిమయాత్ర దారి మళ్లించేందుకు యత్నం ప్రజాసంఘాల వాగ్వాదంతో ఉద్రిక్తత నివాళులర్పించిన ఎంపి, ఎమ్మెల్యేలు విప్లవ నినాదాల మధ్య అంత్యక్రియలు

కరీంనగర్, నవంబర్ 27: పశ్చిమబెంగాల్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ పార్థివ దేహానికి ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో వేలాదిమంది అశ్రునయనాల మధ్య విప్లవ నినాదాలతో తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 4.20 గంటలకు మావోయిస్టు వౌలిక సిద్ధాంతాన్ని అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలాఉండగా కిషన్‌జీ భౌతికకాయం శనివారం అర్ధరాత్రి పెద్దపల్లికి చేరుకోవడంతో ఆదివారం ప్రజల సందర్శనకోసం పార్థివ దేహాన్ని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఉంచేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకొని టెంట్లను తొలగించడంతో ఆయన ఇంటి ప్రాంగణంలోనే ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, కిషన్‌జీ మాజీ సహచరులు, ప్రజాగాయకుడు గద్దర్, విరసం నేతలు వరవరరావు, కల్యాణ్ రావు, పౌరహక్కుల సంఘం నాయకుడు శేషయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు వెంకట్రామయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులతో పాటు పెద్దపల్లి ఎంపి జి వివేక్, ఎమ్మెల్యేలు సిహెచ్ విజయ రమణారావు, కొప్పుల ఈశ్వర్, టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేత ఈటెల రాజేందర్, వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితర ప్రజాప్రతినిధులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు కిషన్‌జీ భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన నేపథ్యంలోనే వీలైనంత త్వరగా అంతిమయాత్ర ముగించాలని పోలీస్ అధికారులు కుటుంబీకులపై ఒత్తిడి తేవడంతోపాటు, పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు కిషన్‌జీ మాజీ సహచరులు, ప్రజాసంఘాల నేతలకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం తలెత్తింది. అయితే పోలీసులు కొంత వెనక్కి తగ్గడంతో కిషన్‌జీ భౌతికకాయంతో ప్రధాన వీధులగుండా అంతిమయాత్ర నిర్వహించి, అవుసుల బావి శ్మశాన వాటికలో మావోయిస్టు పార్టీ లాంఛనాల ప్రకారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ యోధుడికి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకూడదన్న పార్టీ సిద్ధాంతం మేరకు కిషన్‌జీ అన్న సోదరుడితో పాటు వరవరరావు, విమలక్క, మందకృష్ణ తదితరులు చితికి నిప్పంటించారు. అంతిమయాత్ర ఆద్యంతం పోలీసుల కనుసన్నల్లో కొనసాగినా, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం ఖాతరు చేయకుండా విప్లవగేయాలను ఆలపిస్తూ ప్రభుత్వ, పోలీస్ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు.
(చిత్రం) కిషన్‌జీ భౌతిక కాయం

Saturday, September 24, 2011

రెండుకళ్ల మీడియా

రెండుకళ్ల మీడియా

-సాక్షి


చంద్రబాబు లాగే మీడియాది కూడా రెండు కళ్ల పాలిసీ. కాకపోతే కొంచెం తేడా.
మీడియా నేత్రాల్లో ఒకటి గుడ్డి కన్ను. రెండోది డేగ కన్ను. తాను భయపడేవారిని గుడ్డి కంటితోనూ, తనకు భయపడేవారిని డేగ చూపుతోనూ చూడటం మీడిమేలపు మీడియా ఆరితేరిన విద్య.
మాటవరసకో సినిమా అమ్మడు ఓ కుర్రాడితో యవ్వారం బెడిసో, ఇంకేదో కష్టమొచ్చో మింగకూడనిది మింగి ఆస్పత్రిలో పడుతుంది. ఇంకో పెద్దింటి పిల్లగాడు వయసు తిమ్మిరిలో మోటారు బైకును విమానంలా నడిపి, తలపగలగొట్టుకుని పెద్దాసుపత్రిపాలవుతాడు.
ఇలాంటి శాల్తీలంటే మీడియా వీరులకు భయంలేదు. పైగా అలుసు. ఇంకేం? కబురు అందీ అందగానే అడ్డగోలు స్క్రోలింగులను ఇష్టం వచ్చినట్టు దొర్లించి, అడ్డమైన సినిమా పాటలను బాక్‌గ్రౌండులో వినిపించి, ఏదేదో ఊహించి, అదే నిజమైనట్టు చిలవలు పలవలుగా చిత్రించి, పనిలేని పోచుకోలు రాయుళ్లను పోగేసి, వాగించి, పొద్దస్తమానం ఊదరపెడతారు. ఆగమేఘాలమీద ఓబి వాన్లతో ఆస్పత్రిపైకి దండెత్తి, కనపడ్డ డాక్టర్లను, చూడవచ్చినవారిని అడిగిందే అడుగుతూ, చెప్పిందే చెప్పిస్తూ, తల్లడిల్లుతున్న రోగి తాలూకువారిని చచ్చు ప్రశ్నలతో గుచ్చుతూ, మీకు ఎలా ఉంది, ఏమనిపిస్తున్నదంటూ ఒళ్లు మండేలా అడిగేస్తూ... జాతియావత్తూ అర్జంటుగా తెలుసుకుని తీరాల్సిన అతి ముఖ్య సమాచారం అదే అయినట్టు చూసే జనానికి పిచ్చెక్కిస్తారు. ఎందుకయ్యా ఇంత అతి, వాళ్ల ఏడుపు వాళ్లని ఏడ్చుకోనివ్వరాదా అని ఎవరైనా అడిగితే... పబ్లికు కళ్లలో పడేవాళ్ల ప్రైవేటు బతుకులను బజార్నపెట్టటమే మీడియాకు దేవుడు వేసిన డ్యూటీ అయినట్టు, ప్రజాప్రాముఖ్యంగల ఏ విషయాన్నీ వదలకుండా వెంటాడి, మొదలంటా కూపీ తియ్యటమే తమ పని అంటూ బడాయికబుర్లు బాగా చెబుతారు.
మంచిదే. ఆ మాత్రం చురుకుతనం మీడియాగణానికి ఉండాల్సిందే.
కాని - ఆఫ్టరాల్ ఒక సినిమా నటి, ఒక ఆటగాడి కొడుకు, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, పరువుగా బతికే ఒక పేదింటి ఆడపిల్ల, ఒక సాధారణ చిరుద్యోగిలాంటి మనుషులకు ఏదైనా జరిగితేనే, జరగబోతుందంటేనే ఓవరైపోయి, మందీమార్బలమంతా యుద్ధప్రాతిపదికన మోహరించి, నానా హడావుడి చేసే మీడియా జాగిలాలు... నిజంగా అతి ముఖ్యమైన వ్యక్తుల విషయాల్లో అంతకు పదింతల చొరవ, నూరింతల చురుకుతనం చూపించాలి కదా? ఒకవేళ ఎవరైనా వాస్తవాన్ని కప్పిపుచ్చజూసినా పట్టుదలతో వెంటాడి, తమ పత్తేదారు ప్రతిభ మొత్తాన్నీ ఉపయోగించి, సకల వనరులనూ సమస్త శక్తియుక్తులనూ సమీకరించి, ప్రజలకు తెలియాల్సిన విషయాన్ని ఎలాగైనా రాబట్టాలి కదా?
న్యాయంగా అయితే ‘‘ఔను’’. కాని - బతకనేర్చిన మన మీడియా మల్లుల అమోఘ దృష్టి కొందరికి సంబంధించిన కొన్ని విషయాలపైకి ప్రసరించదు. వారికి ఇబ్బంది కలిగిస్తుందనుకునే ఏ పర్సనల్ మాటర్‌నూ మీడియా బుద్ధిమంతులు వినరు. కనరు. మాట్లాడరు. ఆ విషయంలో గాంధిగారి కోతులు కూడా వారి ముందు బలాదూరు.
ఉదాహరణకు సోనియాగాంధి! దేశానే్నలే సంకీర్ణానికి ఆమే సారథి. అతి ప్రధాన అధికారపక్షానికి ఆమే సర్వాధికారి. పేరుకు సింగుగారు ప్రధాని అయినా కేంద్ర సర్కారుకు నిజానికి ఆమే కర్ణ్ధారి. వివిఐపిల్లోకెల్లా వివిఐపి అయిన అంతటి ప్రముఖ వ్యక్తికి ఈ మధ్య చాలా జబ్బు చేసింది. అత్యవసర వైద్యంకోసం హుటాహుటిన ఆమె అమెరికా పోయింది. అక్కడ పెద్ద ఆపరేషను కూడా జరిగింది. కాని - ఈ సంగతులేవీ ఆమె తరఫువాళ్లు చెప్పేదాకా మహా ఘనత వహించిన మన మీడియా డిటెక్టివులకు తెలియనే తెలియదు.
దేశంలోని పెద్దా చిన్నా పత్రికలకూ, చానెళ్లకూ ఢిల్లీలో కాంగ్రెసు బీటు కవర్ చెయ్యటానికి స్పెషల్ కరెస్పాండెంట్లూ, పొలిటికల్ ఎడిటర్లూ వగైరాలు ఎన్నో డజన్లు ఉంటారు. ఎఐసిసి పెద్దతలకాయలను పేరుపెట్టి పిలిచేవాళ్లూ, టెన్ జన్‌పథ్‌కు తాము చాలా దగ్గరనీ... తమ సలహా అడక్కుండా సోనియా, రాహుల్‌లు అడుగుతీసి అడుగు వెయ్యరని గొప్పలు చెప్పేవాళ్లూ పదుల సంఖ్యలోనే ఉంటారు. అయినా అధినేత్రికి జబ్బుముదిరి, అమెరికాపోయి ఆపరేషను చేయించుకున్న వైనం బీబీసీ, ఎఎఫ్‌పి లాంటి విదేశీ మీడియా ద్వారా ఆధికారికంగా ప్రకటించేదాకా ఈ సర్వజ్ఞుల్లో ఒక్కరూ ఎరుగరు!
పోనీ వారంతట వారే బయటపెట్టిన తరవాత, నాయకురాలి పరిస్థితి ఎలా ఉన్నదోనని యావద్దేశం ఆందోళన పడసాగినప్పుడైనా మన మీడియా వేగులు ఆమె క్షేమసమాచారాలు ఆరాతీసేందుకు చొరవ చూపారా? సోనియా చికిత్స పొందుతున్నది సప్తసముద్రాల ఆవల రహస్య నేలమాళిగలో కాదు. న్యూయార్క్ మహానగరంలో! ఆమె ఏ ఆస్పత్రిలో ఉన్నదీ, ఆమెకు ఆపరేషను చేసిన తెలుగు వైద్యుడు ఎవరన్నదీ అందరికీ తెలిసిపోయింది. కడుపు తీయించుకునేందుకో, పొట్ట తగ్గించుకునేందుకో ఏ సినిమా శాల్తీనో అలాంటిచోట చేరినట్టు ఉప్పందితేచాలు - ఎక్కడెక్కడి చానెళ్ల ఓబీ వాన్లూ, వాగుడు మేళాలూ ఎంత ఖర్చయినా వెనుదీయక హుటాహుటిన అక్కడికి చేరుకుని, ప్రత్యక్ష ప్రసారాలతో ప్రేక్షకుల దుంపతెంచేవి. అంతంత ఓవరాక్షన్లు చేయకపోతే మానె! ఆస్పత్రి అధికారులను కలిసి, (అనధికారిక) దేశాధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం రాబట్టి ప్రజలకు తెలియజేసే పాపాన కూడా మన మీడియా మోతుబరులు పోలేదు. దేవుడి దయవల్ల ఆమె క్షేమంగా తిరిగొచ్చి తన పని తాను చేసుకోవటం మొదలెట్టాకయనా కనీసం దూరం నుంచైనా ఆమె ఫోటో తీసి ప్రజలకు చూపెట్టే సాహసం ఏ పెద్ద పత్రికా, ఏ పేద్ధ ఛానలూ చెయ్యలేదు.
ఒకానొక రుగ్మతకు చికిత్స జరిగిందని పార్టీ వర్గాలు గుంభనంగా చెప్పటమే తప్ప ఆ రుగ్మత ఏమిటో ఎవరికీ తెలియదు. కర్ణాకర్ణిగా కాన్సర్ అని వినడమే, ఏ రకం కాన్సరన్న దానిపై వదంతులే తప్ప సోనియాజీకి వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటి, ఎంతవరకూ అది అదుపులోకి వచ్చిందన్నది నేటికీ అతి రహస్యమే. కాలగర్భంలో కలిసిన సోవియట్ యూనియన్ లాంటి కమ్యూనిస్టు రాజ్యాల్లో అధినేత ఆరోగ్య స్థితి ఎంత విషమించినా బయటికి చెప్పక ఇనుపతెర వెనుక తొక్కి పెట్టారంటే నియంతృత్వ వ్యవస్థలో అలాంటివి మామూలేనని సరిపెట్టుకో వచ్చు. కాని సమాచార హక్కుకు చట్టంచేసి, పారదర్శకత్వానికి పాదు చేసిన ప్రజాస్వామిక వ్యవస్థలో మీడియా తన ప్రాథమిక ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చిపడ్డ అడ్డంకి ఏమిటి? అమెరికాలో దేశాధ్యక్షుడి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి మెడికల్ రిపోర్టునూ రివాజుగా ప్రజల ఎదుట పెడతారు కదా? ఇండియాలో అతి ముఖ్య అధికార కేంద్రమైన సోనియాగాంధి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రజలకు తెలియ జెప్పడానికి మీడియా వెనకాడవలసిన అగత్యమేమిటి? మీడియా తన పనితాను చేస్తానంటే సోనియాగాంధిగాని, ఆమె కుమారుడు గాని వద్దంటారా? కట్టె తీసుకుని వెంటపడతారా? మీడియా చొరవను వారు అడ్డుకున్న దృష్టాంతం మనకు తెలిసినంతలో ఒక్కటైనా ఉందా? మరి మీడియా వారికి భయమెందుకు?
ఎమర్జన్సీ కాలంలో కాస్త వంగమని సర్కారు అంటే మీడియా ఏకంగా కాళ్లమీద పాకెయ్యసాగిందని అప్పుడెప్పుడో అద్వానీ అన్నాడు. ఇవాళ ఎమర్జన్సీ లేదు. వంగి తీరాలని సర్కారువారూ మెడమీద కత్తేదీ(బహిరంగంగా) పెట్టిన దాఖలాల్లేవు. ఐనా మన మీడియాకు ఎందుకీ పాకుడు ఖర్మ?

we | రెండుకళ్ల మీడియా | Andhra Bhoomi

we రెండుకళ్ల మీడియా Andhra Bhoomi

NTPC burns more coal to produce electricity

Sunday, September 4, 2011

సమ్మెకు సమాయత్తం..!

సకల జనుల సమ్మె ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా బడులివ్వాలన్న ధృడ సంకల్పంతో  పకడ్బంది  ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల ౧౩ నుండి ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు పొలిటికల్ జాక్  ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలను పూర్తి చేసింది. అటు తెరాస కూడా ఈ నెల 12 న కరిమ్నాగార్లో భారి బహిరంగ సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింపజేయతంతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ల ఫై  ఒత్తిడి తీవ్రతరం చేయాలన్న వ్యూహం కన్పిస్తోంది.

sfd | సమ్మెకు సమాయత్తం..! | Andhra Bhoomi

sfd సమ్మెకు సమాయత్తం..! Andhra Bhoomi

Saturday, August 20, 2011

డీలాపడ్డ వైఎస్సార్ కాంగ్రెస్

 


కరీంనగర్, ఆగస్టు 19: జిల్లాలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్ ఆస్తులపై సిబిఐ చేపట్టిన దాడులతో పురిటిలోనే సంధికొట్టినట్లయింది. దాంతో నిన్న, మొన్నటి వరకు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టిన శ్రేణులు ఒక్కసారిగా డీలాపడిపోయాయి. ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకలతో పాటు అక్రమ ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై రాష్ట్ర హైకో ర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దాడుల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే కరీంనగర్ జిల్లాలో మొదటి నుంచి పడుతూ లేస్తూ ముందుకు నడుస్తున్న పార్టీ కార్యక్రమాలు గత నాలుగైదు రోజులుగా స్థబ్ధతకు గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా పోయింది. దాంతో మొదట్లో రామగుండంకు చెందిన రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి పార్టీని జిల్లాలో ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో వైఎస్‌కు బలమైన మద్ధతుదారులుగా గుర్తింపు పొందిన టిఆర్‌ఎస్ మాజీ రెబల్ కె.కె.మహేందర్ రెడ్డి, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్‌లు కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అదే సమయంలో మంథనికి చెందిన టిడిపి జడ్పీటిసి పుట్ట మధు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో జిల్లాలో ఒక్కసారిగా ఆ పార్టీకి ఊపు లభించిన దాఖలాలు కన్పించాయి. పార్టీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలోనే మలివిడత తెలంగాణ ఉద్యమం పెద్దఎత్తున తెరపైకి రావడంతో సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయిలో జరుగకుండా పోయింది. దానికి తోడు వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి ప్లీనరీలో జగన్ గోడమీది పిల్లిలా ఆత్మరక్షణ దోరణి అనుసరించి తెలంగాణపై విధానాన్ని స్పష్టం చేయకపోవడంతో ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లాయి. ఈ పరిణామాల క్రమంలో తెలంగాణ జిల్లాల నాయకత్వ బాధ్యతలను పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లా బాధ్యతలను పుట్టమధుకు అప్పగించారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలు పట్టాలు ఎక్కుతున్న సమయాన ఊహించని రీతిలో హైకోర్టు జగన్ ఆస్తులను విచారించాలని తీర్పు వెలువరించడంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా డీలాపడ్డాయి. రానున్న రోజుల్లో సిబిఐ చేపట్టిన విచారణలో ఎలాంటి అంశాలు వెలుగుచూస్తాయో, పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనన్న విషయమై పార్టీశ్రేణులు తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే రాజకీయ విశే్లషకులు మాత్రం జగన్‌పై సిబిఐ చేపట్టిన విచారణ నష్టం కంటే జగన్‌కు లాభమే అధికంగా చేకూర్చుతుందన్న భావనలు వ్యక్తమవుతుండడంతో జగన్‌పై కాంగ్రెస్,టిడిపిలు కుమ్మక్కై కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం వల్లే సిబిఐ వంటి కక్ష పూరిత విచారణలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంథని, గోదావరిఖని, కరీంనగర్‌లలో పార్టీ శ్రేణులు సిబిఐ విచారణకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్థాయి కార్యాచరణతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇది మన భారతదేశం

బుద్దా మురళి


గాంధి పుట్టిన దేశమా ఇది..అంటూ కవి ఆరుద్ర ఏనాడో పేద్ద పాట రాశాడు. రాసి మూడు,నాలుగు దశాబ్ధాలు దాటుతున్నా, దేశ పరిస్థితులు అలాగే వున్నాయ..పేరుకు ప్రజలది రాజ్యం..పెత్తందార్లదే భోజ్యం..అన్న దందా ఇంకా నడుస్తూనే వుంది. .ఈ నేపథ్యంలో సగటు మనిషి మనోగతం ఇది..బాధగీతం ఇది. సామ్యవాదం..రామరాజ్యం సంభవించే కాలం కోసం, కలవరింత ఇది.
అమ్మా భారత మాత
బాగున్నావా తల్లీ! ఉత్తరం రాసేప్పుడు ఇక్కడంతా క్షేమమే.. మీరు కూడా క్షేమమే అని తలుస్తాను అనడం మర్యాద. కానీ కళ్ల ముందు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇక్కడంతా క్షేమమే అని ఎందుకో రాయాలనిపించలేదు తల్ల్లీ. సరే ఇంతకూ నీ అడ్రస్ ఎక్కడ మాత. ఏమో ఎప్పుడు చూసినా ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు తప్ప భారత మాత అని ఎవరి నోటి నుండి పెద్దగా వినిపించడం లేదు. మరి నీ అడ్రస్ నాగపూర్ అనుకోవాలా/ లేక ఢిల్లీనా సరే ముందు ఉత్తరమైతే పూర్తి చేస్తాను అడ్రస్‌దేముంది తల్లి అడ్రస్‌ను కూడా గూగుల్‌లో వెతుక్కునే రోజులు వచ్చేశాయి. గూగుల్‌లో సెర్చ్ చేసి పోస్ట్ చేస్తాను లే! జైలులో ఉండాల్సిన వాళ్ల అడ్రస్ అధికార కేంద్రంలో, ఇంట్లో పూజలందుకోవలసిన తల్లిదండ్రుల కేరాఫ్ అడ్రస్ వృద్ధాశ్రమం అవుతోంది మాత అందుకే అడ్రస్ అడిగాను మరోలా అనుకోకు.
నీవు ఎలా ఉన్నావో నాకు తెలియదు మరి నేను ఎలా ఉన్నాననే కదా నీ సందేహం. నిజమే తల్లీ ఎలా ఉన్నా నిరంతరం తన సంతానం మంచి చెడుల గురించే కదా? ఆందోళన చెందుతుంది.
ఎలా ఉన్నానంటే సంతోషంగా ఉన్నానని, చెప్పాలా? బోలెడు బాధల్లో ఉన్నానని చెప్పాలా? చెప్పకూడదని కాదు తల్లి నిజంగా నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు.
1947 ఆగస్టు 14 ఆర్ధరాత్రి... సరిహద్దుల్లో అల్లకల్లోలం. లక్షలాది మంది ఇటు నుండి అటు... అటు నుండి ఇటు.. మత కలహాలు... సంపన్నులు సైతం కట్టుబట్టలతో పరుగులు తీశారు. ఏ ముహూర్తంలో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందో కానీ ఇంకా ఆ అల్లకల్లోలం తీరలేదు తల్లి. కాశ్మీర్‌లో రావణ కాష్టం రగులుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలంగానే ఉన్నాయి. దక్షిణాదిన ఆంధ్రలో చిచ్చు రగులుతోంది. మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెరుగుతున్నాయే తప్ప తక్కడం లేదు.
అయ్యో నా బాధలు చెప్పి నిన్ను మరింత కలవరపెట్టానా? సరే ఇవి ఎప్పుడూ ఉండేవే లే అన్నీ సమస్యలేనే నీ జీవితంలో మంచేమీ లేదా? అనే కదా తల్లి నీకొచ్చిన సందేహం. ఎందుకు లేదు చాతి పొంగిపోయేంత, నేను భారతీయుడ్ని అని గర్వించేంత సంతోషకరమైన విషయాలు చాలానే ఉన్నాయి తల్ల్లీ.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్య తిండి గింజలు. అమెరికా వాడు దయతలిచి ఇచ్చిన గోదుమలు, మంచి నూనెను అమృతంలా తీసుకున్న రోజులు మరిచిపోలేదు తల్లీ. అలాంటిది మొన్న అమెరికా అధ్యక్షుడొచ్చి మన మధ్య స్నేహం అవసరం అంటూ సమాన స్థాయి స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. అంతే కాదు వాళ్ల దేశానికి వెళ్లి ఇండియా నన్ను బాగా ఆదరించింది నా పర్యటనలో కుదిరిన ఒప్పందాల వల్ల అమెరికా పౌరులకు 50వేల ఉద్యోగాలు వస్తాయని గర్వంగా ప్రకటించుకున్నాడు. వాడిచ్చే పాలపొడి, గోధుమ రవ్వ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన రోజులు మరిచిపోలేదు తల్లీ ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు భారతీయులు తెగ తినేస్తున్నారు, పెట్రోల్ వాడేస్తున్నారు అందుకే ధరలు పెరిగాయని వాపోతే దాన్ని నేను సాధించిన అభివృద్ధికి కితాబుగానే భావించాను. వాడిచ్చే గోదుమల కోసం ఎదురు చూసిన ఈ కళ్లతోనే వాళ్లకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి వెళ్లినందుకు నిజంగానే ఆ క్షణంలో గర్వించాను తల్ల్లీ.
అమెరికాలో విడుదలైన కారు మరుసటి రోజే మన రోడ్లమీద దర్శనమిస్తోంది. ఇప్పుడు ప్రపంచం చూపు మన దేశంపై ఉంది.
భారత మాత నీకు తెలియదని కాదు ఇప్పుడు ఎంత అభివృద్ధి సాధించామో తెలుసా? జనాభాలో చైనా తరువాత మనమే. తల్లీ ఇప్పుడు నీ బిడ్డల సంఖ్య 120 కోట్లు. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. బౌగోళికంగా ప్రపంచంలో ఏడవ పెద్ద దేశం. ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలైన హిందూయజం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలను నీ బిడ్డలు అవలంబిస్తున్నారు.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లెక్క ప్రకారం 2010 ఇండియా జిడిపి 1.538 యుఎస్ ట్రిలియన్ డాలర్లు. 2011 1.7 యుఎస్ ట్రిలియన్ డాలర్లు. ఏమిటీ లెక్క అనడుగుతున్నావా? తల్ల్లీ నీలానే నీ బిడ్డల్లో కోట్లాది మందికి ఈ లెక్కలు అస్సలు తెలియవు తల్లీ. చివరకు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన పివి నరసింహారావు సైతం ఈ లెక్కలేమిటో నాకు తెలియవన్నారు. ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తరువాత ఒక సభలో అప్పటి సిఎం చంద్రబాబు సంస్కరణలు, ట్రిలియన్లు బిలియన్లు అంటూ ఏవో లెక్కలు చెబుతుంటే బాబు ఏవో లెక్కలు చెబుతున్నారు, ఈ ట్రిలియన్లు, బిలియన్లు నాకు తెలియవు అన్నారు. మనవడు ముచ్చట్లు చెబుతుంటే అబ్బురంగా విన్న తాతలా ఆయన బాబు ట్రిలియన్ల ముచ్చట్లు వింటూ సంస్కరణలు అంటూ నేను కిటికీలు తెరిస్తే తరువాత వాళ్లు ఏకంగా తలుపులే తెరిచేశారని చెప్పాడు. నిజమే తల్లీ ఈ సంస్కరణల తరువాత తలుపులు తెరిచాక లోనికి విస్తారంగా గాలి వచ్చిందని సంతోషపడాలో, ఈ తుఫాను గాలిలో అస్థిత్వానే్న కోల్పోయి మనది కాని లోకంలోకి కొట్టుకుపోతున్నామో అర్థం కావడం లేదు తల్లీ. నీకు తెలుసా తల్లి ఈ దేశంలో రోజుకు 20 రూపాయలు సంపాదించే నీ బిడ్డలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. తిన్నది అరక్క రాత్రి పూట క్లబ్బుల్లో లక్షలు ఖర్చు చేసే బిడ్డలూ ఉన్నారు. రాత్రి జీవితం కోసం గతంలో వలె సింగపూర్‌కో మరో దేశానికో వెళ్లక్కర లేదు. చాలా రాష్ట్రాల రాజధానులు రాత్రి కాగానే సింగపూర్‌లు అయిపోతున్నాయి.
మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అట. కొనుగోలు శక్తి ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతి పెద్దదట! ఒక నివేదిక ప్రకారం 2011లో కొనుగోలు శక్తిలో భారత్ జపాన్‌ను అధిగమిస్తుంది. 2045 నాటికి అమెరికాను అధిగమిస్తుంది. మరో నాలుగు దశాబ్దాల పాటు భారత వృద్ధిరేటు ఎనిమిది శాతం వరకు ఉంటుందట! 2050 వరకు కూడా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందట! పని చేసే యువత శాతం అత్యధికంగా ఉండడమే ఈ వృద్ధికి కారణం.
అందుకే మన దేశాన్ని పాశ్చాత్యులే కాదు చివరకు మన వాళ్లు సైతం వినియోగదారుల్లానే చూస్తున్నారు తప్ప మనుషుల్లా కాదు.
మరో విషయం చెబుతాను తల్లీ టాటా వాళ్లు ఆ మధ్య నానో కారు తయారు చేశారు. ఇది ప్రపంచంలో కెల్లా చౌకయిన కారు. ప్రపంచంలో అత్యధికంగా బేసిక్ కార్లు తయారు చేసేది మన దేశమే. పేదరికం అత్యధికం ఇక్కడే సంపద ఇక్కడే. బిలియనీర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నది ఇక్కడే, అంత కన్నా వేగంగా పేదల సంఖ్య పెరుగుతున్నది ఇక్కడే.
దేశంలో సగం మంది పిల్లలు నిర్ణీత బరువు కన్నా తక్కువగా ఉంటున్నారు. అంటే వారికి సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అమెరికా అధ్యక్షుడంతటి వాడు మీరు తెగ తిని తాగేస్తున్నారర్రోయ్ అని మొత్తుకున్నది మన గురించే తిండి లేక బక్కచిక్కుతున్నది మనమే చిత్రంగానే ఉంది కదు తల్లీ.
మనకు తెలియకుండానే భారత దేశంలో రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి తల్లీ. ఒకటి సంపన్న భారత దేశం, మరోటి కడు పేద భారత దేశం. భారత్, పాకిస్తాన్‌లు చీలిపోయినంత వేగంగా రెండు భారత దేశాలు చీలిపోతున్నాయి. ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ ఈ చీలిక ఏనాటికైనా ప్రమాదమే తల్లీ. కొడుకుల్లో సగం మంది మంచి తిండి, సుఖ సంతోషాలతో ఉంటే మిగిలిన సగం మంది ఆకలి కేకలు వేస్తుంటే ఏ తల్లి మనసైనా తల్లడిల్లకుండా ఉంటుందా? సరే తల్లీ వీటి గురించి మళ్లీ మాట్లాడదాం కానీ ఎప్పటి నుండో నాకో సందేహం.
నీ కడుపున ఎలాంటి వీరులు పుట్టారు. దేశ భక్తులు, సంఘ సంస్కర్తలు, శత్రువులను చీల్చి చెండాడిన మహా యోధులు, మేధావులు ఎంత మంది పుట్టారు తల్లీ. అలాంటి నీ కడుపున ఇప్పుడు నపుంసక నాయకులు పుట్టారేమి తల్లీ. దేశ ఆర్థిక రాజధానిలో రాక్షసుల్లా దాడి చేసి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరుడు అల్లుడిలా ఆతిథ్యం పొందుతుంటే ఎంత గాంధేయ వాదులమైనా సహించలేకపోతున్నాం తల్ల్లీ. ఈ దేశం ననే్నం చేస్తుంది అన్నట్టుగా వాడు కోర్టులో వెకిలినవ్వు నవ్వుతుంటే ఎందుకో తల్లీ ఎంత క్షమించేద్దామన్నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు కనిపిస్తే ఎందుకు తల్లీ ఈ నపుంసక నాయకత్వాన్ని మాకు కట్టబెట్టావని నిలదీయాలనిపిస్తోంది. జలియన్ వాలాబాగ్‌లో అమాయకులను చంపిన డయ్యర్‌ను మట్టుపెట్టిన నీ కుమారులు ఇప్పుడేమయ్యారు తల్లీ.
ప్రపంచానికి అణుబాంబును పరిచయం చేసిన వాడు సైతం చివరి రోజుల్లో తనను క్షమించమని వేడుకుని కుమిలిపోయాడు. అంత కన్నా శక్తివంతమైన నిరాహార దీక్ష అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన మహాత్మాగాంధీని కన్నావు. ఆయుధ సంపత్తితో ఉన్న బ్రిటీష్ వాడిని ఓడించాలంటే అంత కన్నా బలమైన ఆయుధం కావాలి. పేద భారతీయులు అలాంటి ఆయుధాన్ని ఎలా సమకూర్చుకుంటారు. ఎంత కాలమైనా బానిసత్వంలో మగ్గవలసిందేనా? అనుకుంటున్న తరుణంలో ఒక్క బక్క జీవి అంత బలమైన బ్రిటీష్‌వాడిని నిరాయుధం ఆనే ఆయుధంతో చావు దెబ్బ తీశాడు. అప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా రక్త పాతం కనిపించింది. ఒకరు విజయం సాధించారు అంటే మరొకరు ఓడిపోయారు. రెండువైపులా రక్తం ప్రవహిస్తేనే అది యుద్ధం. కానీ యుద్ధానికే కొత్త నిర్వచనం చెప్పి రక్తపాతం లేకుండా ఇద్దరూ గెలిచే కొత్త యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మోహన్‌దాస్ కరం చంద్ గాంధీని కన్న తల్లివి. ఈ దేశాన్ని పాలించుకునేంత శక్తి సామర్ధ్యాలు భారతీయులకు లేవు, వాళ్లు చవటలు అంటూ చర్చిల్ లాంటి వాడు తిడితే తన పాలనతోనే వాడికి సమాధానం చెప్పి నవ భారతానికి పునాదులు వేసిన జవహర్‌లాల్ నెహ్రూలాంటి వజ్రాన్ని కన్నావు. ఏమన్నావురా మాకు పాలించడం చాతకాదా? చవట ఇప్పుడు చూడరా నీ దేశం గత చరిత్ర మాది భవిష్యత్తు అని వాడికి ఎలుగెత్తి చాటే విధంగా దేశానికి బలమైన పునాదులు నిర్మించారు. అంత కన్నా కొంత ముందుకు వెళితే అఖండ భారతాన్ని తురుష్క ముష్కరులు దాడులు జరిపి దోచుకుంటున్న కాలంలో కత్తి పట్టి వీరోచితంగా పోరాడిన శివాజీ లాంటి వీరులను ఎంతోమందిని కన్నావు తల్లీ. అప్పటి గాలి నీరు అలాంటిది అని సరిపెట్టుకుందామంటే స్వాతంత్య్రం వచ్చాక కూడా ఇందిరాగాంధీ లాంటి వీరనారిని ఈ దేశానికిచ్చావు కదా! పాకిస్తాన్ సైనిక పాలకుడు యాహ్యాఖాన్ 1971 డిసెంబర్ మూడున పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు పాకిస్తాన్ సైన్యానికి ఆదేశాలిచ్చారు. సరిగ్గా మరో 13 రోజుల్లోనే పాకిస్తాన్‌ను చీల్చి ఢాకా రాజధానిగా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడినట్టు ఇందిరాగాంధీ ప్రకటించారు. తన దేశంలోని రెండు సైనిక స్థావరాలపై దాడులకు ఆదేశించిన దేశాన్ని రెండు ముక్కలు చేసిన వీరత్వం ఎక్కడ, ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటుపై దాడి చేసిన వాడిని శిక్షించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న శిఖండి నాయకత్వం ఎక్కడ. భారత పాకిస్తాన్ ల మధ్య యుద్ధం అంటూ జరిగితే చైనా పాకిస్తాన్‌కు అండగా నిలుస్తుంది. కానీ మేం మాత్రం మీకు సహకరించేది లేదు అని అమెరికా ఖరాఖండిగా అధికారికంగానే తేల్చి చెప్పినా నీ మద్దతు లేకుంటే యుద్ధం చేయలేమని ఎందుకనుకుంటున్నావు చేతలతోనే ప్రశ్నించి పాకిస్తాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత సైనికులకు ధైర్యాన్ని నూరిపోసిన ఆ వీరనారి ఎక్కడ. పార్లమెంటుపై దాడి చేస్తే దండిస్తే అమెరికాకు కోపం వస్తుందేమో, ఓటు బ్యాంకు చెదిరిపోతుందనేమో అని భయపడిన పిరికి జీవులెక్కడ. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి ఇందిరాగాంధీ మొదటి నుండి అండగా నిలిచారు. కోటి మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చారు. కష్టాల్లో ఉన్న పొరుగు వాడిని ఆదుకోడం నీ కనీస ధర్మం. పొరుగు వాడిగా సహాయం చేసేందుకు సదా సిద్ధంగా ఉంటాను, కానీ నావైపు కనె్నత్తి చూస్తే ఇక నీకు చూసేందుకు కన్ను లేకుండా చేయడానికి వెనకాడను అనే సందేశాన్ని ఇచ్చి, ప్రతిపక్ష నాయకునిచేత కూడా అపరకాళి అని బిరుదు పొందిన ఇందిర ఎక్కడ రిమోట్‌తో నడిచే పప్పెట్ పాలకులెక్కడ?. బంగ్లావిముక్తికి సహకరించినందుకు బంగ్లాదేశ్ ఇచ్చిన అత్యున్నత పురస్కారం ఆమె కోడలు స్వీకరించారు. వీరనారిగా పురస్కారానికి ఇందిరాగాంధీ అర్హురాలే కానీ, నాయకత్వ లక్షణాల్లో కోడలికంత అర్హత ఉందా? నువ్వే చెప్పు తల్లీ. మేం ఏ జన్మలో చేసుకున్న పాపం తల్లీ ఈ జన్మలో ఇంత సన్నాసి పాలకులనిచ్చావు. తల్లిని ప్రశ్నించడం పాపమంటారు కానీ ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాను తల్లీ. ఇలాంటి నాయకులను కన్నందుకు నేను నిన్ను ప్రశ్నించాలా? లేక నీ దేశాన్ని ఇలాంటి నాయకుల చేతిలో పెట్టినందుకు నువ్వు నన్ను నిలదీస్తావా? యధారాజ తథా ప్రజ అన్నారు అంటే తప్పు నాలోనే ఉందంటావా తల్లీ. ఏమో అది కూడా నిజమే కావచ్చు.
దేశంలో ఇప్పుడు 467 మిలియన్ వర్కర్స్ ఉన్నారట! అంటే పని చేసేశక్తి ఉన్నవారిలో ప్రపంచంలో మనది రెండో స్థానంలో ఉన్న దేశం. మధ్యతరగతి ప్రజల సంఖ్య 580 మిలియన్లు, ప్రపంచంలోని 15 టాప్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల్లో ఏడు మన దేశానికి సంబంధించినవే.
భారత మాత ఆర్థిక రంగంలో సాధిస్తున్న ఈ అభివృద్ధిని చూసి సంతోష పడమంటావా? ప్రపంచంలోని సగం మంది నిరక్ష్యరాస్యులు, పేదవారు, పౌష్టికాహారం లోపించిన వారు ఈ దేశంలోనే ఉన్నారని బాధపడమంటావా?
ప్రపంచానికి నీ దేశం ఏమిచ్చింది? అని ప్రశ్నించి సున్నా అని ఒకడు నవ్వాడు. ఔను సున్నానే అని నీ బిడ్డలు గర్వంగా చెప్పుకుంటున్నారు. నిజమే కదా తల్లీ ప్రపంచానికి మన దేశం సున్నా ఇవ్వకపోతే ఈ ప్రపంచం అభివృద్ధి సున్నా వద్దే నిలిచిపోయేది కదా! అర్యభట్టు, భాస్కరాచార్య, ఆటమిక్ సిద్ధాంతానికి మూల పురుషుడు ఆచార్య కంద, అమెరికా పురుడు పోసుకోకముందే ప్రపంచానికి కెమికల్ సైన్స్‌ను పరిచయం చేసిన నాగార్జునుడు, వైద్యానికి పితామహుడు ఆచార్య చరకుడు, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు ఆచార్య శుశ్రుతి. వరాహమిహీరుడు, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించిన యోగా పితామహుడు ఆచార్య పతంజలి, వైమానిక టెక్నాలజీని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చెప్పిన ఆచార్య భరద్వాజ, కాస్మాలజీ ఫౌండర్ ఆచార్య కపిల వీరంతా నీ ముద్దు బిడ్డలే కదా తల్లీ ఇలాంటి ఎందరో మహనీయులను, వీరులను, సంఘ సంస్కర్తలను కన్న నీవు ఇప్పుడెందుకమ్మా మరి ఇలా...
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని మురిసిపోవాలా? నీ దేశంపై దాడి చేసినా నువ్వు ఏమీ చేయలేవురా అని వాడు వికృతంగా నవ్వుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాలా?
ఒద్దు తల్లీ ఇలాంటి శిఖండి నాయకత్వం మాకొద్దు... నెత్తురు మండే యువత ఒకవైపు నపుంసక నాయకత్వం ఒకవైపు ఇది అన్యాయం తల్ల్లీ. అయినా అమ్మా నిజంగా దీన్ని నేను అభివృద్ధి అనుకోవాలా? నా గ్రామాల్లో మంచినీరు లేదు కానీ కోకాకోలా, విదేశీ మద్యం దొరకని గ్రామం లేదు. సగం మందికి తిండిలేని నా దేశానికి పిజ్జాలు అవసరమా తల్ల్లీ. ఇంతకూ నేను ప్రపంచం దృష్టిలో వినియోగదారునే్ననా? లేక మహోన్నతమైన సంస్కృతికి వారసుణ్ణా?
ఇంత భారీ అభివృద్ధిని నేను భరించలేను తల్లీ నా సంస్కృతిని, నా సంప్రదాయాలను పణంగా పెట్టి సాధించుకున్న ఈ అభివృద్ధి నన్ను గందరగోళంలో పడేస్తోంది.
ఇప్పుడు నా పరిస్థితి జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది. ఎటు వెళుతున్నానో, ఏది మంచో ఏది చెడో నాకు అర్థం కావడం లేదు. కంటికి కనిపిస్తుంటే ఇది అభివృద్ధి కాదు అని చెప్పలేను. సగం మంది దుఃఖంలో ఉండి, గ్రామాలు జీవచ్ఛవంలా కనిపిస్తుంటే ఇదే అభివృద్ధి అని చెప్పలేను. ఈ గందరగోళంలో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఐటిలోనే కాదు భార్యాభర్తలు విడిపోవడంలోనూ అమెరికాతో పోటీపడుతున్నాం.
నిజంగా నాకేం కావాలో నాకే తెలియడం లేదు. నిజమే కదా! కొడుకు అవసరం ఏమిటో తల్లికే తెలుస్తుంది. జాతరలో తప్పిపోయిన నన్ను చేయి పట్టుకుని సరైన మార్గంలో తీసుకువెళ్లాల్సింది నువ్వే తల్లి. ముందు ఈ జాతర నాకు అబ్బురంగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం తల్లీ ఒడిలో నిర్భయంగా పడుకోవాలని ఉంది. మరో ప్రపంచం అయినా తల్లి ఒడికి సాటిరాదు కదా! తల్లీ
సరే ఇక ఉంటానమ్మా!
నీ కోటాను కోట్ల మంది బిడ్డల్లో ఒకరు *
***
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కరప్షన్
మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దానే్న అమ్మాలి. లేదా డిమాండ్ సృష్టించాలి. ఎంసెట్‌కు ఉన్న డిమాండ్‌ను మన రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలానే దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుంది. మరి అవినీతిలో పాఠాలు నేర్పడానికి ఒక డిగ్రీ కోర్సు ప్రారంభిస్తే దాని ప్రకటన ఎలా ఉంటుంది.
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కరప్షన్
నేషనల్ కరప్షన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
( పార్లమెంటు ఉభయ సభలకు అనుబంధం)
అవినీతిపై ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో బిడిసి కోర్సు చేయండి.
హవాలా, కుంభకోణాలు, ఫైనాన్షియల్ నెట్‌వర్క్ ( రాష్ట్ర పార్టీ నుండి కేంద్ర పార్టీకి, కేంద్రం నుండి రాష్ట్ర పార్టీలకు నిధుల మళ్లింపులో చక్కని శిక్షణ ఇవ్వబడును. లంచాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి వాటిలో ప్రాక్టికల్ క్లాస్‌లు ఉంటాయి. చాయ్ పానీ మొదలుకొని స్వీట్ బాక్స్, కలర్ టీవి, ఫారన్ ట్రిప్ ల వంటి చిన్నచిన్న అవినీతి వ్యవహారాలతో పాఠాలు మొదలు పెట్టి 2జి స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాల వరకు అన్నింటిలో అవగాహన కల్పిస్తాం. అవినీతికి పాల్పడే చాన్స్ వచ్చినప్పుడు ఇది నాకు తెలియదు అనే అవకాశం లేకుండా మిమ్ములను మా డిగ్రీ సర్వసన్నద్ధం చేస్తుంది.
మీ పార్టీ వారు అవినీతికి పాల్పడినా, మీరు అవినీతికి పాల్పడినా ఏ విధంగా తప్పించుకోవాలో శిక్షణ ఇస్తాం. మీడియా ప్రశ్నలు ఎలా ఉంటాయి, నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఏ విధంగా సమాధానం చెప్పాలో నిపుణులతో శిక్షణ ఉంటుంది. మనీష్ తివారి, రవిశంకర్ ప్రసాద్‌లతో ఈ అంశంపై ప్రత్యేక క్లాసులుంటాయి.
లా అండ్ ఆర్డర్
మిమ్ములను కేవలం అవినీతికే పరిమితం చేయం. మర్డర్, రేప్ చేసి ఎలా తప్పించుకోవాలో చక్కని శిక్షణ లభిస్తుంది. స్థానిక పోలీసులను చెప్పుచేతుల్లో ఉంచుకోవడం, బెయిల్ పొందడం వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. నేరం చేయడానికి సిద్ధం కాగానే ముందస్తు బెయిల్ పొందడం. ఒక వేళ జైలుకు వెళితే అక్కడి నుండే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంపై తగు శిక్షణ ఉంటుంది.
అర్హతలు: ఈ కోర్సులో చేరడానికి కనీసం వంద కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అనుభవం ఉండాలి
ఒకటిలేక రెండు రేపులు, ఒకటి రెండు హత్యలు చేసి ఉండాలి.
దేశంలోని వివిధ కోర్టుల్లో కనీసం పది కేసులు విచారణలో ఉండాలి.
కనీసం ఆరునెలల జైలు జీవితం ఉండాలి.
కనీసం స్విస్ బ్యాంకులో ఒక్క అకౌంట్ అయినా ఉండాలి.
====
ఇది మన దేశం
ఇది నా దేశం అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు.
* ఇక్కడ బియ్యం కిలో 40 రూపాయలు.. సిమ్‌కార్డ్ మాత్రం ఉచితం
*పిజ్జాకు ఆర్డర్ ఇస్తే అరగంటలో ఇంటి ముందుకొస్తుంది. గుండెపోటు వచ్చినా, హత్య జరిగినా అంబులెన్స్ రావాలంటే చాలా సమయం పడుతుంది.
*కారు లోన్‌కు ఐదు శాతం వడ్డీ , చదువుకోవడానికి విద్యార్థులకు ఇచ్చే రుణాల వడ్డీ 13 శాతం
* ఈ దేశంలో రెండు ఐపిఎల్ టీంలను 3300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇదే దేశంలో రోజుకు ఒక పూట తిండిలేని వాళ్లు కోట్లలో ఉన్నారు.
* ఈ దేశంలో కాళ్లకు ధరించే పాదరక్షలను ఎసి షోరూ ముల్లో అమ్ముతారు. తినే కూరగాయలను ఫుట్‌పాత్‌లపైన, చెత్తకుప్పల పక్కన అమ్ముతారు.
* ప్రతి వారు తమ పేరు పత్రికల్లో రావాలని, తాము టీవీల్లో కనిపించాలని అనుకుంటారు. మంచి పనితో కాదు ఏ తప్పు చేసైనా సరే అని
* ఈ దేశంలో పెద్ద మాల్స్‌లున్నాయి. అదే పట్టణాల్లో భారీ మురికివాడలున్నాయ.
* ఎన్నో చోట్ల ఆడవారు, మగవారు రైల్వే ట్రాక్‌నే మరుగుదొడ్డిగా ఉపయోగించుకునే దేశమిది. ఇదే దేశంలో ఒక జంటకు మూడు బాత్‌రూంలు కూడా ఉన్నాయ.
* ఈ దేశంలో నాయకులు ప్రజలకు సేవ చేస్తూ జీతంతో పాటు వారి నుండి డబ్బులూ తీసుకుంటారు.
* మనం అవినీతికి వ్యతిరేకంగా అనర్ఘళంగా ఉపన్యాసం ఇస్తాం. రాంగ్ రూట్‌లో వెళితే ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే చేతిలో నోటు పెట్టి వెళ్లిపోతాం.
* నిజాన్ని ఒప్పుకుందాం.. ఇది మన భారతదేశం.