Saturday, December 24, 2011

సిండికేట్లే విలన్లు

టార్గెట్లే నియంత్రణకు అవరోధం వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపణ

హైదరాబాద్, డిసెంబర్ 23: మద్యం సిండికేట్లు ఎక్సైజ్‌శాఖను శాసించేస్థాయికి చేరుకున్నాయని, వాటివల్లనే తమ శాఖకు చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్‌శాఖ జెఎసి ఆరోపించింది. ప్రభుత్వం తన ఆదాయం పెంచుకోవడం కోసం మద్యం అమ్మకాలకు టార్గెట్స్ పెట్టిందని, దీనివల్లనే వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సి వస్తుందని ఎక్సైజ్ జెఎసి పేర్కొంది. ఎక్సైజ్‌శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ అఫీసర్స్ సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ సంఘాలు కలిసి శుక్రవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగుల జెఎసిగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్‌గా ఎన్నికైన ఎస్‌ఎం రామేశ్వర్‌రావు, సెక్రటరీ జనరల్ ఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తాజాగా ఎక్సైజ్‌శాఖపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయం పెంచుకునేందుకు తమకు టార్గెట్స్‌ను విధించిందని, దీనివల్ల వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరించలేదని వారు వాపోయారు. పైగా తమశాఖకు సిబ్బంది కొరత వేధిస్తోందని దీనిని కూడా సిండికేట్లు తమకు సానుకూలంగా మలుచుకుని నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమేనని వారు అంగీకరించారు. ఇక నుంచి అలా జరగకుండా కఠినంగా వ్యవహరించక తప్పదని రామేశ్వర్‌రావు హెచ్చరించారు. ఎమ్మార్పీ రేట్లు, మద్యం షాపుల సమయపాలన, విడి అమ్మకాలపై దృష్టి సారించి మద్యం సిండికేట్ల ఆటకట్టిస్తామని వారు పేర్కొన్నారు. మద్యం సిండికేట్లకు,తమ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని వారు ఖండించారు. సిబ్బంది కొరత, వనరులు, సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇసుక తీస్తే ఇక ఉక్కు పాదమే


* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు  
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
-ఆంధ్రభూమి బ్యూరో -

కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు.

షరా‘మామూల్’..

* పోలీసులు, రెవెన్యూలకే సింహభాగం

* విడిసిల ముసుగులో అక్రమ అనుమతులు

* యథేచ్ఛగా ఇసుక మాఫియా


కరీంనగర్, డిసెంబర్ 22: నిన్న లిక్కర్ సిండికేట్ కుంభకోణం..నేడు ఇసుక మాఫియా..ఇలా ఏ కుంభకోణం వెలుగులోకి వచ్చినా అందులో అధికార పార్టీ ముద్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌కు చెందిన చోటా మోటా నాయకులదే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. చోటా మోటా నాయకులే కదా! అని తీసిపారేయకండీ. వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లుకమ్మక తప్పదు. సగటున రోజుకు వారి ఆర్జించేది అక్షరాల లక్ష రూపాయల పై మాటే. ఇందుకు భూగర్భ జలవనరుల శాఖ, గనుల శాఖ అధికారుల తోడ్పాటు షరా‘మామూల్’గా జరిగిపోయేదే. ప్రతిఫలంగా అక్రమార్కులను చూసి చూడనట్లుగా వదిలివేయటమే. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట అధికార పార్టీకి చెందిన నేతలు అనధికారికంగా ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. ఇందుకుగాను కేవలం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు విడిసికి చెల్లించి ఇక ఆ ఏడాది పొడవునా కావాల్సినంత ఇసుకను తోడుకుపోయే వెసులుబాటును కల్పించారు. దాంతో పెద్దవాగు, మానేరు వాగు, గోదావరి నదీ పరిసరాల్లో ఈ అక్రమ క్వారీలు వెలిశాయి. విడిసిల ద్వారా క్వారీలను చేజిక్కించుకున్న వ్యక్తులు పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో మాత్రమే పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి తమ పని చక్కబెట్టుకున్నాక చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రతీ నెలా ఇసుక కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులకు 45 నుంచి 60 వేల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయ. అయితే గ్రామాభివృద్ధి పేరుతో స్థానిక సంస్థలకు పోటీగా పెత్తనం చెలాయిస్తున్న ఈ విడిసిలపై సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే గ్రామానికి సంబంధించిన లావాదేవీలన్నీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో ఇసుక క్వారీలకు టెండర్లు నిర్వహించి చౌకధరలకు కట్టబెట్టి లోపాయికారిగా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనేది నగ్న సత్యం. ఉదాహరణకు రాయికల్ మండలంలోని మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి ప్రాంతాల్లో ఇసుక తవ్వుకునేందుకు వేలం పాటలు నిర్వహించి కేవలం 2.45 లక్షల రూపాయలకే క్వారీని కట్టబెట్టడం గమనార్హం. అయితే సగటున ఈప్రాంతం నుంచి సదరు కాంట్రాక్టర్ రోజుకు 50 ట్రాక్టర్లకంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలిస్తూ విడిసికి చెల్లించిన మొత్తం రుసుంను రెండు, మూడు రోజుల్లోనే వసూలు చేసుకోగలిగారు. దీన్నిబట్టి విడిసిలు ఇసుక మాఫియా అనుబంధం ఎంత గాఢంగా బలపడి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే వీణవంక మండలం ఇప్పలపల్లి, కోర్కల్, కొండపాక, బోయినపల్లి మండలం వరదవెల్లి, శభాష్‌పల్లి, కొదురుపాక, కరీంనగర్, గంగాధర, బోయినపల్లి మండల సరిహద్దుల్లోని బావుపేట, ఒద్యారం, ఖాజీపూర్, మల్లాపూర్ తదితర ప్రాంతాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, జమ్మికుంట మండలం  విలాసాగర్, తనుగుల, తిమ్మాపూర్ మండలం రేణికుంట, కొత్తపల్లి తదితర ప్రాంతాల నుంచి సగటున రోజుకు ఒక్కో ఇసుక రీచ్ నుంచి 60 నుంచి 70 ట్రాక్టర్ల వరకు ఇసుక తవ్వకాలు, తరలింపు అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల చొప్పున ఇసుక విక్రయిస్తూ ఒక్కో కాంట్రాక్టర్ సగటున రోజుకు లక్ష రూపాయల వరకు ఆదాయం గడిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతిలేని చిన్న చిన్న వాగులు, వంకలపై జరుగుతున్న తతంగం. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతీ ఒక్కరి హస్తం ఉన్నట్లు అర్థమవుతోంది. వీణవంక మండలం ఇప్పలపల్లిలో ఓ రాజకీయ నాయకుడు రోజుకు 60-70 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిన్నారు. అలాగే ఇదే మండలంలోని కోర్కల్‌లో ఓ స్థానిక నేత ఏకంగా మానేరులో జెసిబిలు మోహరించి ఇసుక తవ్వకాలను జరుపుతున్నారు. సదరు వ్యక్తి కూడా షరా మామూలుగా సంబంధిత అధికారులకు భారీగానే ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొండపాక గ్రామంలో ఓ నాయకుడు రోజుకు పది ట్రాక్టర్ల చొప్పున ఇసుకను తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి మానేరుకు వాహనాలు వెళ్లకుండా పెద్దఎత్తున కందకాలు తవ్వినప్పటికీ నిరాటంకంగా ఇసుక తరలింపు కొనసాగుతోంది.
ఇకపోతే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ముగ్గురు వ్యక్తులు గ్రామాభివృద్ధి కమిటీకి నాలుగు లక్షల 80 వేల రూపాయలు చెల్లించి సగటున రోజుకు 20-30 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ సదరు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులకు నెలకు రెండున్నర లక్షలకు పైగా మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక బోయినపల్లి మండలంలోని వరదవెల్లి, శాభాష్‌పల్లి, కొదురుపాక గ్రామాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి పెద్దమొత్తంలో కరీంనగర్ శివారులోని బావుపేట గ్రానైట్ క్వారీల్లో కుప్పలుగా పోసి అక్కడి నుంచి లారీల్లో రాజధానికి తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా ప్రతీ నెల లక్షల్లో అధికారులకు ముట్టజెబుతోంది. వారే అన్ని వర్గాలకు పర్సెంటేజీల చొప్పున మామూళ్లు పంచుతున్నట్లు ఆరోపణలున్నాయ.

మద్యం సిండి‘కేటు’లకు ఐటి దడ

కొత్త మలుపు తిరిగిన సిండికేట్ కుంభకోణం 
 
రంగంలోకి దిగనున్న ఆదాయ పన్నుల శాఖ?
 
టాస్క్ఫోర్సు చిట్టాలో జీరో వ్యాపారుల గుట్టు?
 

కరీంనగర్, డిసెంబర్ 17: మద్యం సిండికేట్ల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోందా? ఎసిబి దాడుల్లో భాగంగా వెంట తీసుకెళ్లిన రికార్డుల ఆధారంగా సిండి‘కేటు’ల గుట్టు బయటపెట్టేందుకు రంగం సిద్ధం అవుతోందా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన వివిధ శాఖల అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా ఈ కుంభకోణంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వార్తలు వస్తుండటం కలకలం రేకిత్తిస్తోంది. మరీ ముఖ్యంగా అడ్డగోలు ధరలకు మద్యం విక్రయించి అక్రమాలకు పాల్పడిన సిండికేట్లపై ఐటి కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో మద్యం వ్యాపారుల్లో దడ మొదలైంది. ఇక ఐటి నిజంగానే రంగంలోకి దిగినట్లైతే మద్యం వ్యాపారుల రూపంలో ఉన్న బడాబాబుల ఆస్తుల గుట్టు కూడా తేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎతె్తైతే ఏడాదికోసారి మద్యం షాపులు, గీత కార్మిక సంఘాలపై ఆరోపణలు వచ్చినపుడు మాత్రమే దాడులు నిర్వహించే స్పెషల్ టాస్క్ఫోర్సు(ఎస్‌టిఎఫ్) ఎసిబి ట్రాప్‌లో పడటం, ఎసిబి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో జీరో దందా చేస్తున్న ‘పెద్ద’ మనుషుల బండారం కూడా నమోదు చేసి ఉండటం వంటి పరిణామాలను భేరీజు వేసి చూస్తే రాబోయే రోజుల్లో సిండికేట్ల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనే చెప్పాలి. నిన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన సిండికేట్ నిర్వాహకులు ప్రమాదాన్ని గ్రహించి హుటాహుటిన రాజధానికి పరుగులు తీసి ఉచ్చు నుంచి బయట పడేందుకు మార్గానే్వషణ ప్రారంభించారు.ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి సహాయంతో బయట పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో ప్రకంపనలు రేకెత్తిస్తున్న ఈ మద్యం సిండికేట్ కుంభకోణం మూలాలు మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాలోనే వెలుగు చూసాయి. ఈ కుంభకోణంలో క్షేత్రస్థాయి అధికారుల నుండి మొదలుకుని రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో జిల్లాలో కొత్త చర్చకు తెరలేచింది. ఎసిబి దాడుల్లో భాగంగా సిండికేట్ వ్యాపారులకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ హార్ట్ డిస్క్‌లను సీజ్ చేసి తీసికెళ్లిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులకు సంబంధించిన రికార్డులలో నెలవారీ వ్యాపార లావాదేవీలు, ఖర్చుల వివరాలతోపాటు శాఖల వారీగా ఏయే శాఖలకు ఎంతెంత సొమ్ము ముట్టజెప్తున్నారో అందులో సవివరంగా నమోదు చేసి ఉండడంతో, ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న అధికారులు భయంతో వణికిపోతున్నారు. అంతేకాకుండా మద్యం వ్యాపారులకు సంబంధించి ఐఎంఎల్ డిపో నుండి కొనుగోలు చేసిన స్టాక్, ధరల వివరాలు తిరిగి అమ్మకాలకు సంబంధించిన ధరల వంటి వివరాలు కూడా సిండికేటు రికార్డులలో భద్రపరిచినట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఐఎంఎల్ డిఫో ద్వారా జారీ చేసే మద్యం ధరలకు రిటేల్ అమ్మకపు ధరలకు మధ్య భారీ తేడా ఉంటోంది. ఎంఆర్‌పి ధరలకు విక్రయించకుండా వ్యాపారులంతా సిండికేట్లుగా మారి వాస్తవ ధరలకు రెట్టింపు మొత్తానికి విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటైల్ షాపులకు కేసుల లెక్కన ఐఎంఎల్ డిపో మద్యం సరఫరా చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా బీర్ అమ్మకాలదే అగ్రస్థానం. ఉదాహరణకు బీరు అమ్మకాలను తీసుకుంటే 12 లైట్ బీర్లు కలిగిన కేసును 680 రూపాయలకు వ్యాపారులకు అందిస్తుండగా, స్ట్రాంగ్ బీరు కేసును 780 రూపాయలకు జారీ చేస్తుంది. విడిగా ఒక్కో లైట్ బీరు సిసాను 56 రూపాయలు, స్ట్రాంగ్ బీరును 65 రూపాయలకు అందిస్తుండగా వాటి ఎమ్మార్పీ ధర లైట్ బీరు 71 రూపాయలు కాగా, 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే స్ట్రాంగ్ బీరు ధర 82 రూపాయలు కాగా 110 రూపాయలకు విక్రయిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఎమ్మార్పీ ధర కంటే 50 శాతం నుంచి 75 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లకు సంబంధించి మద్యం విక్రయాలను ఎమ్మార్పీకి మించి అమ్మకూడదన్న నిబంధనలేవీ లేకపోవడంతో ఇష్టంవచ్చినట్లు ధరలు నిర్ణయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రిటేల్ షాపుల్లో మాత్రం ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా ఆయా షాపుల లైసెన్స్‌లను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులను మద్యం వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుని గతంలో ఎప్పుడూ లేనంత భారీగా మద్యం ధరలు పెంచి యథేచ్చగా దోపిడీ సాగిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఎసిబి దాడులతో ఆయా శాఖల సిబ్బంది ఎందుకు కళ్లుమూసుకున్నారన్న విషయం బట్టబయలు కావడంతో సిండికేట్లలో గుబులు మొదలైంది. ఇదంతా ఒకెతె్తైతే మహారాష్ట్ర, ఛత్తీష్‌ఘ్ఢ్ రాష్ట్రాలకు సమీపంలో ఉన్న సరిహద్దు మండలాలైన మంథని, మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, ముత్తారం తదితర మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన జీరో మద్యం పెద్ద ఎత్తున తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తూర్పు డివిజన్‌లో దాడులు నిర్వహించిన స్పెషన్ టాస్క్ఫోర్సు నజరానాలు పుచ్చుకుని దోషులను వదిలేశారన్న విమర్శలున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండిపడేందుకు ఎక్సైజ్ అధికారులు సహకరించారన్న విషయం తేటతెల్లమైంది. ఇదిలా ఉండగా సిండికేట్ రహస్యాలు చేజిక్కించుకున్న ఎసిబి మద్యం లావాదేవీల చిట్టాను ఆదాయ పన్నుల శాఖకు అప్పగించిన పక్షంలో జిల్లాలో ‘పెద్ద’ మనుషులుగా చలామణి అవుతున్న బినామీ మద్యం వ్యాపారుల అక్రమాల పుట్ట పగిలే అవకాశం లేకపోలేదు. గతంలో నిర్ణయించిన మద్యం షాపుల వేలం కంటే ఈ సారి రెట్టింపు ధర వెచ్చించి షాపులను చేజిక్కించుకున్న బడాబాబులకు అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కిడినుంచి వచ్చిందన్న అనుమానాలున్నాయి. బినామీ పేర్లపై జిల్లాకు చెందిన రాజకీయ ‘ప్రముఖులు’ నల్ల ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వైట్ మనీ చేసుకునే ప్రయత్నంలో బాగంగానే బినామీ పేర్లపై కోట్లు వెచ్చించి షాపులను దక్కించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ గనుక రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే బ్లాక్ మనీ బాబుల బండారం బయటపడక తప్పదనే చెప్పాలి.

ఖద్దర్..కాంట్రాక్టర్ చెట్టపట్టాల్..!

* కోట్లు కొల్లగొడుతున్న ఇసుక మాఫియా

 * ప్రజాప్రతినిధుల అనుచరులదే కీలక పాత్ర

 * అధికారులకూ నెల నెల మామూళ్లు

 * ఇందిరమ్మ పేరుతో రాజధానికి లారీల తరలింపు

ఆంధ్ర భూమి బ్యూరో
-----------------------

కరీంనగర్, డిసెంబర్ 20: ఖద్దర్ చొక్కాలు, కాంట్రాక్టర్‌లు కూడబలుక్కుంటే ఎలా ఆర్జించవచ్చో..ఇసుక మాఫియాను చూసి ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఇసుకేస్తే కాసులు రాలుతుండడంతో ఇసుక క్వారీలు మాఫియాకు బంగారు గనులుగా మారిపోయాయి. అధికారికంగా కొంత, అనధికారికంగా కొండంత అన్నట్లుగా రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లు అధికారులను నయానో, భయానో గుప్పిట్లో పెట్టుకొని యదేశ్ఛగా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన వేలం పాటల్లో తొమ్మిది ఇసుక రీచ్‌లకు సంబంధించి పది కోట్లకు పైనే ఆదాయం లభించింది. అయితే టెండర్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో అక్రమాలు జరిగాయంటూ కొంత మంది వ్యాపారులు హైకోర్టుకెక్కారు. దాంతో అక్కడ తవ్వకాలకు అధికారికంగా బ్రేక్ పడింది. ఇవి కాకుండా వెల్గటూరు మండలం ముత్తునూరు, ముక్కట్రావుపేట, రామగుండం మండలం పొట్యాల రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తవ్వేందుకు అనుమతించారు. జిల్లాలో ప్రస్తుతం అధికారిక ఇసుక క్వారీలు ఈ రెండు మాత్రమే. కానీ హైకోర్టు బ్రేక్ వేసిన తొమ్మిది రీచ్‌ల్లో ప్రధానమైన రీచ్‌గా భావిస్తున్న కొదురుపాక రీచ్ నుండి ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు యదేశ్ఛగా ప్రోక్లైన్లు పెట్టి మరీ ఇసుకను వందలాది లారీల్లో ప్రతీ రోజు రాజధానికి తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన తరువాత ఒక్కో లారీ ఇసుకకు సగటున 15 వేల నుంచి 18 వేల రూపాయల మధ్య వసూలు చేస్తారు. అలాగే స్థానికంగా ఇసుక ట్రాక్టర్ల చొప్పున విక్రయించడం జరుగుతుంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల మధ్య ఇసుక నాణ్యతను బట్టి వసూలు చేస్తారు. ఇలా జిల్లాలోని మానేరు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వందలాది అనధికారిక ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో తరలిస్తున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టలేని ధైన్య స్థితిలో ఉన్నారు. కళ్ల ముందు నుండి లారీలు తరలివెళ్తున్నా పట్టించుకోవడం లేదంటే ఇసుక మాఫియా అధికార యంత్రాంగాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో ఊహించవచ్చు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇసుక మాఫియా ప్రతీ నెలా గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా ఉన్నతాధికారి వరకు, కానిస్టేబుల్ మొదలుకొని పోలీస్ ఉన్నతాధికారుల వరకు లక్షల్లో మామూళ్లు ముట్టచెబుతూ పని చక్కబెట్టుకుంటున్నారనేది నగ్న సత్యం.
మాఫియాకు కాసులు కురిపిస్తున్న రియల్ భూం..

నాలుగేళ్ల క్రితం వరకు ఇసుక దందాపై జిల్లాలో పెద్దగా ఎవరికి అవగాహన ఉండేది కాదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భూం మొదలైన తరువాత భవన నిర్మాణాలు పెద్దఎత్తున ప్రారంభం కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఇసుక వ్యాపారులు కరీంనగర్ జిల్లాపై దృష్టి సారించడంతో దీని వెనుక సాగుతున్న ఆర్థిక లావాదేవీలపై జిల్లా నేతలు దృష్టి సారించారు. ఈ వ్యాపారంలో కోట్ల పంట పండుతోందనే విషయాన్ని పసిగట్టడంతో ఏడాది క్రితం నిర్వహించిన వేలం పాటల్లో నేరుగా తమ అనుచరుల పేరుతో ఇసుక దందాలోకి అడుగుపెట్టారు. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి అనుచరులే ఇసుక మాఫియాకి శ్రీకారం చుట్టారు. వేలం పాటల్లో కొన్ని రీచ్‌ల్లో వీరికి టెండర్లు దక్కినప్పటికీ హైకోర్టు ఉత్తర్వుల పుణ్యమా అని బ్రేక్ పడడంతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. దాంతో జిల్లాలో అనధికారికంగా వందకు పైగా రీచ్‌ల నుంచి యథేచ్ఛా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో రాజకీయంగా ఘర్షణలు తలెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయా సందర్భాల్లో ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు, పోలీస్ సిబ్బంది ఆ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయను చూసి మనకెందులే అన్న నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.
రూల్స్..గీల్స్ జాన్తానై..

జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతి లేదు. అత్యవసరం కింద ఇందిరమ్మ గృహాలకు, గ్రామాల్లో ఇళ్లు కట్టుకునే వారికి అధికారులు అనుమతిస్తారు. దానికనుగుణంగా ఇసుకను తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతిచ్చిన క్వారీలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో వెల్గటూర్ మండలంలో ముత్తునూర్. ముక్కట్రావ్‌పేట , రామగుండం మండలంలో పొట్యాల ఒకటి ఇసుక క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలి. దానికి అధికారులు అనుమతి ఇస్తారు. మిగితా చోట్ల ఇసుక తరలింపునకు అనుమతులు లేవు. కానీ జిల్లాలోని ఇల్లంతకుంట మండలం మల్లాపూర్ కొత్త బ్రిడ్జి వద్ద ఇష్టం వచ్చిన రీతిలో ఇసుకను తోడేస్తున్నారు. అలాగే బోయినపల్లి మండలం మాన్వాడ, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, మంథని, మహదేవ్‌పూర్, జమ్మికుంట మండలం వావిలాల, వీణవంక వద్ద ఉన్న మానేరు నుండి ఈ ఇసుక తరలింపును చేస్తున్నారు. అలాగే కరీంనగర్ నగర శివారు నుంచి కూడా పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు, ఉద్యోగుల సహకారంతో మాఫియా ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుతూ యదేశ్ఛగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. గత నలబై రోజులుగా పెద్దఎత్తున జరుగుతున్న ఈ దందాలో వందలాది లారీలు హైదరాబాద్‌కు తరలిపోయాయి. జిల్లాలోని పలుచోట్ల నుండి కళ్లముందే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో అక్రమంగా ఇసుక తరలించే లారీలను, ట్రాక్టర్లను సీజ్ చేసి 5వేల నుంచి 15వేల వరకు జరిమానా వేసేవారు. ట్రాక్టర్స్, లారీలను సీజ్ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అక్రమార్కులు వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందాలో వచ్చిన డబ్బుల్లోంచి కొంత శాతం అధికార పార్టీ నేతలకు రాయల్టీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. అదేకాకుండా ఆయా గ్రామాల పరిదిలో ఇసుకను తీసినప్పుడు అడ్డుకోకుండా ఉండేందుకుగాను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులకు కూడా కొంత ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఇసుకను తోడేందుకు జెసిబిలను వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టకపోతే భూగర్భ జలాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

ఇసుక తీస్తే ఇక ఉక్కుపాదమే!

* ‘్భమి’ కథనాలతో అధికారుల్లో కదలిక * అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు * జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు * నిఘాకోసం ప్రత్యేక బృందాలు * నేడో, రేపో విడిసిలపైనా కేసులు * వెల్లడించిన జాయింట్ కలెక్టర్


కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇసుక అక్రమమైనింగ్‌కు ప్రధానంగా అధికారిక వేలం పాటలు నిర్వహించకపోవడమే కారణమని భావించి అనుమతికోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు నిర

ఇసుక తీస్తే ఇక ఉక్కుపాదమే!

* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
 
-ఆంధ్రభూమి బ్యూరో
 

కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇసుక అక్రమమైనింగ్‌కు ప్రధానంగా అధికారిక వేలం పాటలు నిర్వహించకపోవడమే కారణమని భావించి అనుమతికోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు నిర్ణయించారు.