Friday, December 2, 2011

రెవెన్యూలో బది‘లీల’లు..

* కాసులిచ్చుకున్న వారికి కోరుకున్న పోస్టింగ్‌లు? * దళిత అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు! * అసంతృప్తితో రగులుతున్న డిప్యూటీ తహశీల్దార్లు

కరీంనగర్, నవంబర్ 29: కక్షసాధింపులో రెవెన్యూ శాఖ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇటీవల రెండు దఫాలుగా జరిగిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ల బదిలీల ప్రహనంలో రెండవ దఫా జరిగిన బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. కాసులిచ్చుకున్న వారికే వారు కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చి దళిత, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు కట్టబెట్టారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఇంకా 19 డిప్యూటీ తహశీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి పొందిన అభ్యర్థులకు వారు పని చేసిన చోటే పోస్టింగ్‌లు ఇవ్వడం ఈ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ కాసుల తతంగంలో రెవెన్యూలోని కలెక్టరేట్ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిప్యూటీ తహశీల్దార్ నుంచి లక్ష రూపాయలు మొదలుకొని మూడు లక్షల వరకు మామూళ్లు పుచ్చుకొని వారికి అనువైన పోస్టింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా పగ్గాలు చేపట్టిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో 24 మంది తహశీల్దార్లు, 27 మంది డిప్యూటీ తహశీల్దార్లు స్థాన భ్రంశం కల్పించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ఈ బదిలీలపై కించిత్ కూడా అసంతృప్తి కన్పించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆ 24 మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు సుదీర్ఘకాలం అదే చోట పని చేయడంతో పాటు స్వస్థలాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. దాంతో కలెక్టర్ వారిపై బదిలీ వేటు వేయడం పట్ల రెవెన్యూలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాకుండా ప్రజల నుండి కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది మరిచిపోకముందే రెండవ దఫా జరిపిన బదిలీల ప్రక్రియలో సీన్ రివర్స్ అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 డిప్యూటీ తహశీల్దార్లు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16 మంది సీనియర్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించి డిప్యూటీ తహశీల్దార్లుగా ఆయా స్థానాల్లో భర్తీ చేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ అసిస్టెంట్లుగా చాలా కాలం వివిధ హోదాల్లో పని చేసిన అభ్యర్థులకు మళ్లీ అక్కడే డిటిగా పదోన్నతి ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కలెక్టర్ ఏ అంశాన్నయితే ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారో డిటిల నియామకానికి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న గుస గుసలు విన్పిస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పి ‘దక్షిణ’ చెల్లించుకున్న వారికి పోస్టింగ్‌లు ఇప్పించడంలో కృతకృత్యులైనట్లు చెబుతున్నారు. ఇందులో జరిగిన బదిలీలను కొన్ని గమనిస్తే పై అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డిటిలకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఆయా సామాజిక వర్గాల సిబ్బంది తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ఎంతైనా ప్రస్తావనార్హం. ఇందులో వసంత అనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారిణికి సీనియర్ అసిస్టెంట్ నుంచి డిటిగా పదోన్నతి ఇచ్చిన తరువాత ఆమె పెగడపల్లి స్థానాన్ని కోరుకున్నారు. అది కాకపోతే కనీసం కరీంనగర్ పరిసర మండలాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఆమెకు హుస్నాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చి అన్యాయం చేశారని ఆ వర్గానికి చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.వనజాక్షి అనే వికలాంగురాలైన సీనియర్ అసిస్టింట్‌కు పదోన్నతి కల్పించిన అధికారులు ఆమె కోరుకున్న కరీంనగర్ లేదా జగిత్యాల పోస్టింగ్ ఇవ్వకుండా ప్రాధాన్యత లేని వేములవాడ ఎన్నికల డిప్యూటి తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌లోనే సీనియర్ అసిస్టెంట్‌గా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలంగా పని చేసిన అంజయ్యకు పదోన్నతి కల్పించిన తరువాత నిబంధనల ప్రకారం వేరే ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టింగ్‌ను ఇవ్వాల్సి ఉండగా ఈయన విషయంలో అధికారులు ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపించారు. కరీంనగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా మరో నెల రోజుల్లో పదవీవిరమణ చేయాల్సి ఉన్న రాంనారాయణ స్థానానికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా ఆయన రిటైర్డ్ కాకుండానే అంజయ్యకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని, జిల్లావ్యాప్తంగా ఇంకా 19 స్థానాలు ఖాళీగా ఉన్నా ఖాళీ కాని స్థానానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే మెట్‌పల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా దశాబ్ధానికి పైగా మెట్‌పల్లిలో విధులు నిర్వహించిన నాగార్జున అనే ఉద్యోగిపై కూడా అధికారులు వల్లమాలిన అభిమానాన్ని ప్రదర్శించారు. అక్కడ ఆయనపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పక్కన పెట్టి తిరిగి మెట్‌పల్లికే డిప్యూటీ తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల పట్టణానికే చెందిన రాజేశ్వర్ అనే సివిల్ సప్లరుూస్ డిప్యూటీ తహశీల్దార్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సుమారు దశాబ్ధకాలానికి పైగా పని చేశారు. ఏడాది క్రితమే ఆయనకు గంగాధర సివిల్ సప్లయస్ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తుండగానే తన పలుకుబడిని ఉపయోగించి స్వస్థలమైన జగిత్యాలలో పని చేసే నాగరాజమ్మ అనే ఉద్యోగినిని బదిలీ చేయించి మరీ అదే పోస్టింగ్‌ను పొంది అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ తతంగం అంతా పరిశీలిస్తే రెండవ దఫా జరిగిన బదిలీల ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విషయం రూఢీ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారిస్తారో  లేదో వేచి చూడాల్సిందే !!

రెవెన్యూలో బది‘లీల’లు..

* కాసులిచ్చుకున్న వారికి కోరుకున్న పోస్టింగ్‌లు? * దళిత అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు! * అసంతృప్తితో రగులుతున్న డిప్యూటీ తహశీల్దార్లు


కరీంనగర్, నవంబర్ 29: కక్షసాధింపులో రెవెన్యూ శాఖ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇటీవల రెండు దఫాలుగా జరిగిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ల బదిలీల ప్రహనంలో రెండవ దఫా జరిగిన బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. కాసులిచ్చుకున్న వారికే వారు కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చి దళిత, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు కట్టబెట్టారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఇంకా 19 డిప్యూటీ తహశీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి పొందిన అభ్యర్థులకు వారు పని చేసిన చోటే పోస్టింగ్‌లు ఇవ్వడం ఈ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ కాసుల తతంగంలో రెవెన్యూలోని కలెక్టరేట్ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిప్యూటీ తహశీల్దార్ నుంచి లక్ష రూపాయలు మొదలుకొని మూడు లక్షల వరకు మామూళ్లు పుచ్చుకొని వారికి అనువైన పోస్టింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా పగ్గాలు చేపట్టిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో 24 మంది తహశీల్దార్లు, 27 మంది డిప్యూటీ తహశీల్దార్లు స్థాన భ్రంశం కల్పించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ఈ బదిలీలపై కించిత్ కూడా అసంతృప్తి కన్పించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆ 24 మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు సుదీర్ఘకాలం అదే చోట పని చేయడంతో పాటు స్వస్థలాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. దాంతో కలెక్టర్ వారిపై బదిలీ వేటు వేయడం పట్ల రెవెన్యూలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాకుండా ప్రజల నుండి కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది మరిచిపోకముందే రెండవ దఫా జరిపిన బదిలీల ప్రక్రియలో సీన్ రివర్స్ అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 డిప్యూటీ తహశీల్దార్లు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16 మంది సీనియర్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించి డిప్యూటీ తహశీల్దార్లుగా ఆయా స్థానాల్లో భర్తీ చేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ అసిస్టెంట్లుగా చాలా కాలం వివిధ హోదాల్లో పని చేసిన అభ్యర్థులకు మళ్లీ అక్కడే డిటిగా పదోన్నతి ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కలెక్టర్ ఏ అంశాన్నయితే ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారో డిటిల నియామకానికి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న గుస గుసలు విన్పిస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పి ‘దక్షిణ’ చెల్లించుకున్న వారికి పోస్టింగ్‌లు ఇప్పించడంలో కృతకృత్యులైనట్లు చెబుతున్నారు. ఇందులో జరిగిన బదిలీలను కొన్ని గమనిస్తే పై అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డిటిలకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఆయా సామాజిక వర్గాల సిబ్బంది తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ఎంతైనా ప్రస్తావనార్హం. ఇందులో వసంత అనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారిణికి సీనియర్ అసిస్టెంట్ నుంచి డిటిగా పదోన్నతి ఇచ్చిన తరువాత ఆమె పెగడపల్లి స్థానాన్ని కోరుకున్నారు. అది కాకపోతే కనీసం కరీంనగర్ పరిసర మండలాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఆమెకు హుస్నాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చి అన్యాయం చేశారని ఆ వర్గానికి చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.వనజాక్షి అనే వికలాంగురాలైన సీనియర్ అసిస్టింట్‌కు పదోన్నతి కల్పించిన అధికారులు ఆమె కోరుకున్న కరీంనగర్ లేదా జగిత్యాల పోస్టింగ్ ఇవ్వకుండా ప్రాధాన్యత లేని వేములవాడ ఎన్నికల డిప్యూటి తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌లోనే సీనియర్ అసిస్టెంట్‌గా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలంగా పని చేసిన అంజయ్యకు పదోన్నతి కల్పించిన తరువాత నిబంధనల ప్రకారం వేరే ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టింగ్‌ను ఇవ్వాల్సి ఉండగా ఈయన విషయంలో అధికారులు ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపించారు. కరీంనగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా మరో నెల రోజుల్లో పదవీవిరమణ చేయాల్సి ఉన్న రాంనారాయణ స్థానానికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా ఆయన రిటైర్డ్ కాకుండానే అంజయ్యకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని, జిల్లావ్యాప్తంగా ఇంకా 19 స్థానాలు ఖాళీగా ఉన్నా ఖాళీ కాని స్థానానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే మెట్‌పల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా దశాబ్ధానికి పైగా మెట్‌పల్లిలో విధులు నిర్వహించిన నాగార్జున అనే ఉద్యోగిపై కూడా అధికారులు వల్లమాలిన అభిమానాన్ని ప్రదర్శించారు. అక్కడ ఆయనపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పక్కన పెట్టి తిరిగి మెట్‌పల్లికే డిప్యూటీ తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల పట్టణానికే చెందిన రాజేశ్వర్ అనే సివిల్ సప్లరుూస్ డిప్యూటీ తహశీల్దార్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సుమారు దశాబ్ధకాలానికి పైగా పని చేశారు. ఏడాది క్రితమే ఆయనకు గంగాధర సివిల్ సప్లయస్ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తుండగానే తన పలుకుబడిని ఉపయోగించి స్వస్థలమైన జగిత్యాలలో పని చేసే నాగరాజమ్మ అనే ఉద్యోగినిని బదిలీ చేయించి మరీ అదే పోస్టింగ్‌ను పొంది అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ తతంగం అంతా పరిశీలిస్తే రెండవ దఫా జరిగిన బదిలీల ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విషయం రూఢీ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారిస్తారో

v | రెవెన్యూలో బది‘లీల’లు.. | Andhra Bhoomi

v రెవెన్యూలో బది‘లీల’లు.. Andhra Bhoomi