Sunday, January 10, 2016

The Real hero,.

.
భారత్ నిజమైన స్నేహితుడు..


By Sadanand Bembre

ఇతడి పేరు వాల్డిమిర్_క్రుగ్లయాకొవ్, #మాజీ_USSR 10 Battle గ్రూఫ్ కమాండర్, 1971 భారత్-పాకిస్తాన్ యుధంలొ పాకిస్తాన్ ఓటమి తప్పని పరిస్తులలొ భారత
వ్యతిరేకతను నర నరాన జీర్ణించుకున్న జాత్యహంకార అమెరికన్ డిప్లోమాట్,అరబ్బు లాబీ వారికి దగ్గర సంబందాలున్న అమెరికా రక్షణమంత్రి కిసింజర్ కాళ్ళు పట్టుకున్నాయి. కిసింజర్ రంగంలొకి దిగి అప్పటి అమెరికా అద్యక్షుడు నిక్సన్ పాకిస్తానుకు మద్దత్తుగా భారతదేశం పై దాడి చేయడానికి  అమోదం తెలిపేలా ఓప్పించారు.

ఈ క్రమంలో హెన్రీ కిసింజర్ మాట్లాడుతూ భారత్ ను తీవ్రస్థాయిలొ దూషించాడు కూడా అంతేకాకుండా ఈ యుద్ద సమయంలో బ్రిటన్ కూడా భారత్ పై దాడి చేసేలా బ్రిటన్ ప్రభుత్వాన్ని వొప్పించాడు. ఈ మూర్ఖుడు అంతటితో ఆగకుండా సిద్ధాంత పరమైన విభేదాలున్నప్పటికీ చైనా   మద్దత్తు కూడ తీసుకొవడం కోసం హుటాహుటీన చైనా పర్యటన చేసి చైనా ను కూడా భారత్ కు వ్యతిరేకంగా రణరంగంలోకి దిగేలా ఒప్పించాడు.
వెంటనే అమెరికా, బ్రిటన్ నేవీ లు భారత్ పై దాడి చేయడానికి రంగంలొకి దిగాయి. అమెరికా నుంది అప్పట్లొ అతిపెద్ద విమాన వాహక నౌక #USS_Enterprise (Nuclear) ను, బ్రిటన్ తన విమాన వాహక నౌక #Eagle ను భారత నౌకాశ్రయాలైన, యుధ నౌకలపైన దాడి చేయడానికి రంగంలొకి దింపాయి. చైనా కూడా తన నౌకా దళ్ళాన్ని భారత్ పై దాడి చేయడానికి రంగం సిద్దం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న రష్యా వెంటనే ఈ సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా  భారత్ కు అందించింది. ఈ పరిస్థితుల నుండి  ఏలాగైనా గట్టెక్కించాలని భారత్ రష్యాని కొరడంతో  వెంటనే రష్యా మన Super Star వాల్డిమిర్ క్రుగ్లయాకొవ్ ను రంగంలొకి దింపింది.
వెంటనే వాల్డిమిర్ క్రుగ్లయాకొవ్ ముందుగా చైనా తీవ్ర హెచ్చరికలు జారీచేశారు "మీరు ఏటువంతి పరిస్తితులలొనైనా భారత్ పై దాడిచేస్తే వెంటనే మానుండి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఏదురౌతుంది, అందులో ఏటువంటి సందేహం లేదు, ఈ విషయంలొ ఏమాత్రం రాజీ పడే ప్రశ్నేలేదు" అని హెచ్చరించడంతొ చైనా భారత్ పై దాడి చేయాలనే తన అలొచనను విరమించుకుంది. ఇక ఈ కమాండర్ వెంటనే వ్లాడివొస్టొక్ నుండి రెండు యుద్ధ నౌకలను, రెండు జలాంతర్గాము(Nuclear) లనుతీసుకుని స్వయంగా రంగంలొకి దిగారు.
ఇతను తెలివిగా Enterprise వెంట ఒక యుధనౌక, జలాంతర్గామి, బ్రిటీష్ ఈగల్ వెనుక ఒక యుధ నౌక, జలాంతర్గామితొ కేవలం 500 మీటర్ల దూరం నుండే వెంబడించడం మొదలు పెట్టాడు, అంతెకాకుండా అమెరికా, బ్రిటన్ నేవీలను మీరు భారత్ పై ఒక్క మిస్సైల్ ఫైర్ చేసిన వెంతనే మేము మీమీద డాడి చేస్తామని హెచ్చరిస్తూ వెంబడించాడు. ఐత ఇతనిని తప్పించుకుని పొవాలని అమెరికన్,బ్రిటన్ నౌకలూ ఏంత ప్రయత్నం చేసినా పట్టు వదలని విక్రమార్కుడి వలే వాటిని అలా దాదాపు 26 రోజుల పాటూ వీటిని వెంబడిస్తూ భారతదేశంపై ఈగ కూడా వాలకుండా కాపాడారు.
ఈ లోపు భారతీయ సేనలు విజయ వంతంగా  పాకిస్తాన్ పీచమణచివేయడంతో పాకిస్తాన్ పూర్తిగా ఒడిపోయి తన ఓటమిని అంగీకరించడంతొ చేసేదేమీ లేక అమెరికా, బ్రిటన్ దేశాలు గర్వభంగంతో అత్యంత అవమాన కరమైన రీతిలో తమ నౌకలను వెనక్కు పిలిచాయి. అవి వెళ్లి పొయిన తరువాత కూడా మరలా తిరిగి వస్తాయేమోనని మరో 20 రొజుల పాటు బంగళా ఖాతం లొనే తిష్టవేసి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడారు.
ఇతనికి మన దేశం ఏప్పటికీ కృతజ్ఞత గా ఉండాలి, ఉంటుంది కూడా...

(మూలం: చిరంజీవి నిమ్మరాజు)

No comments:

Post a Comment